40 నిమిషాలకు 40 కోట్లు.. రెమ్యూనరేషన్లో తగ్గేది లేదు రాజా..
సూపర్ స్టార్ రజనీకాంత్కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వయసు 73 ఏళ్లు. అయినా కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సూపర్ స్టార్. గతేడాది రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత వారి డిమాండ్ మరింత పెరిగింది. జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆయన నటించిన ‘లాల్ సలామ్’ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వయసు 73 ఏళ్లు. అయినా కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సూపర్ స్టార్. గతేడాది రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత వారి డిమాండ్ మరింత పెరిగింది. జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆయన నటించిన ‘లాల్ సలామ్’ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోంది. రజినీ కారణంగా మాంచి హైప్ కూడా ఈ సినిమాకు వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు రజనీకాంత్ ఎంత పారితోషికం తీసుకున్నారనే ప్రశ్న అందర్లో తిరుగుతోంది. అయితే దానికి ఆన్సర్ తాజాగా తెలిసిపోయింది. అదే ఆన్సర్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘లాల్ సలామ్’ సినిమాలో రజనీకాంత్ చేసింది మెయిన్ రోల్ కాదు. ఆయన పోషించిన పాత్ర పేరు మొయిద్దీన్ భాయ్. సినిమాలో ఆ పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. అందుకు గాను ఆయన 40 కోట్లు రెమ్యునరేషన్గా అందుకున్నారని కోలీవుడ్ టాక్. అంటే నిమిషానికి కోటి రూపాయలు వసూలు చేశారన్న మాట. ఇక ఈ వార్త అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. కూతురి సినిమా అయినా.. రెమ్యూనరేషన్ తగ్గింవ్వలేని రజీని తీరు కాస్త ట్రోల్ కూడా అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సందీప్ రెడ్డి వంగా పిచ్చి పని !! 7 ఏళ్ల కొడుకుకుతో యానిమల్ సినిమాకి..
బంపర్ ఆఫర్.. చెర్రీ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్!
టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమ !! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

