Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

Pushpa 2: పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

Anil kumar poka

|

Updated on: Dec 29, 2024 | 12:37 PM

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చూడటానికి దక్షిణాది ఆడియెన్స్ కంటే ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మాస్ ఆడియెన్స్ మెచ్చే అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉండడమే దీనికి కారణం. అందుకే నార్త్ లో పుష్ప 2 సినిమా 1000 కోట్లకు చేరువలో ఉంది. అయినా కానీ ఈ సినిమాకు రెస్పాన్స్ ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ఆడియెన్స్‌కు ఓ దిమ్మతిరిగే షాక్ తగిలింది.

ఎస్ ! ఎంతో కోరికతో పుష్ప2 సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన కొందరు ప్రేక్షకులు నిరాశ చెందారు. ఎందుకంటే.. ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు వచ్చిన ఆడియెన్స్‌కు.. థియేటర్ యాజమాన్యం వరుణ్ ధావన్ నటించిన ‘బేబీ జాన్’ సినిమా ప్రదర్శించడంతో ఒక్క సారిగా షాకయ్యారు. తాము ఏ సినిమాకు వచ్చామో తెలియక అయోమాయానికి గురయ్యారు. అయితే జరిగింది ఎక్కడో కాదు.. జైపూర్ సిటీలో ఉన్న రాజ్ మందిర్ థియేటర్లో.! దీంతో ఈ ఘటన ఇప్పుడో క్రేజీ న్యూస్ గా మారింది. నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు ఇందులో కుట్ర కోణం కూడా ఉందనే కామెంట్ వస్తోంది నెట్టింట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.