Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. క్లారిటీ...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. క్లారిటీ…

Phani CH

|

Updated on: Mar 04, 2025 | 3:02 PM

మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. సోషల్ మీడియాలో ఆయన గురించి ఒక కల్పిత వార్త పుట్టుకొచ్చింది. అది కాస్తా అక్రాస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమా రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఇప్పటికే ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నారు చిరంజీవి. ఫిల్మ్ ఫేర్ నుంచి పద్మ విభూషణ్ దాకా ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు మెగాస్టార్ చిరు కీర్తి కీరిటంలో చేరాయి.

ఇదే క్రమంలో చిరంజీవికి యూకే ప్రభుత్వం.. ఆ దేశ పౌరసత్వాన్ని గౌరవార్ధంగా ఇచ్చిందని నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో రంగంలోకి దిగిన చిరు పీఆర్ టీం.. ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చింది. చిరంజీవి బ్రిటన్ దేశపు గౌరవ పౌరసత్వం అందుకోబోతున్నారంటూ వస్తున్న కథనాల్లో ఎటువంటి నిజం లేదని చిరు టీం క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఇటువంటి నిరాధార వార్తలు ప్రచురించేటప్పుడు మీడియా సంస్థలు ఒకసారి నిజ నిర్ధారణ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chhaava: ఒక్క రోజే 25 కోట్లు.. మొత్తంగా దిమ్మతిరిగే లెక్క! ‘ఛావా’ సంచలనం!

ప్రశాంత్ వర్మ సినిమాలో ప్రభాస్ అలా కనిపించనున్నాడా?

పవిత్ర స్నానం చేస్తుంటే.. ఇలా వీడియోలు తీయడం ఏంటి?

ఎట్టకేలకు నోరు విప్పిన వంగా.. ఆన్సర్ దొరికేసింది!

90 కోట్లు పెడితే.. వచ్చింది జస్ట్ 9 కోట్లే! మళ్లీ నెట్టింట అఖిల్ మ్యాటర్ వైరల్

Published on: Mar 04, 2025 03:00 PM