AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు, పవన్‌కు NTR స్పెషల్ థాంక్స్‌

చంద్రబాబు, పవన్‌కు NTR స్పెషల్ థాంక్స్‌

Phani CH
|

Updated on: Aug 14, 2025 | 3:01 PM

Share

స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగ‌స్ట్ 14న వార్2 , కూలీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమయ్యాయి. కాగా, గ‌త కొద్ది రోజులుగా ఈ మూవీ టిక్కెట్ రేట్ల విష‌యంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. సినిమా టికెట్ల ధరలు చెన్నైలో ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని , హైద‌రాబాద్‌లో మాత్రం భారీగా పెంచారంటూ కొంద‌రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్లో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలయికలో రూపొందిన వార్ 2, రజనీకాంత్ న‌టించిన కూలీ సినిమాల టికెట్ల ధరలను పెంచుకోవడానికి మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై హైప్ నెల‌కొని ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమాకు స్పెషల్ షోలు, అధిక ధరలకి టికెట్ల విక్రయం కోసం అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రిలీజ్ రోజున ఉదయం 5 గంటలకు స్పెషల్ షో వేసుకోవచ్చని పేర్కొంది. ఈ షోకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. వార్‌2 మూవీ టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ ఇవ్వడంపై హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా తార‌క్ ధ‌న్యవాదాలు తెలుపుతూ పోస్టు పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉట్టి కొట్టడం ప్రాక్టీస్‌ చేస్తూ.. జారి పడి బాలుడు మృతి

కూలీ రిలీజ్.. సెలవు‌తో పాటు ఫ్రీగా టికెట్స్ ఇచ్చిన సంస్థ.. ఎంప్లాయిస్ ఫుల్ హ్యాపీ

Coolie: కూలీ’ చిత్రానికి వారికి నో ఎంట్రీ

ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు

వాటర్ ప్లీజ్..! కాళ్ల బేరానికొచ్చిన పాక్