AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవునా.. నిజమేనా !! అభిషేక్‌-ఐశ్వర్యలపై వైరల్‌ న్యూస్‌

అవునా.. నిజమేనా !! అభిషేక్‌-ఐశ్వర్యలపై వైరల్‌ న్యూస్‌

Phani CH
|

Updated on: Nov 08, 2024 | 12:47 PM

Share

అభిషేక్‌ బచ్చన్‌ -ఐశ్వర్యల జంట గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, త్వరలో డైవోర్స్‌ తీసుకోబోతున్నారని నెట్టింట రకరకాల రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్‌ వార్త ఆసక్తిగా మారింది. దీంతో ఆ జంట అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు.

ఈ ఇద్దరు క్యూట్‌ కపుల్స్‌ కలిసి సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం వీరిద్దరితో సినిమా తీయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అభిషేక్‌-ఐశ్వర్యలు కలిసి చాలా సినిమాలు చేశారు. వాటిలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గురు’ ప్రత్యేకంగా నిలిచింది. వీరి వివాహానికి కొన్ని రోజుల ముందు ఈ సినిమా విడుదలై ఆకట్టుకుంది. అందులో వీరి కెమిస్ట్రీ అందరినీ కట్టిపడేసింది. ఇక మణిరత్నం అంటే వీరిద్దరికీ ఎంతో గౌరవం. ఈవిషయాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా అభిషేక్‌, ఐశ్వర్యలు వెల్లడిస్తూనే ఉంటారు. మణిరత్నం దర్శకత్వంలో పనిచేయాలని అందరూ కోరుకుంటారని.. ఆయన సినిమాల్లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని అభిషేక్‌ ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. ‘తిరువర్‌, గురు, రావణ్‌, పొన్నియిన్‌ సెల్వన్‌.. వంటి గొప్ప సినిమాల్లో మణిరత్నం తనకు అవకాశం కల్పించారని అభిషేక్‌ గుర్తు చేసుకుంటారు. ఇక మణిరత్నం తనకు గురు సమానులని ఐశ్వర్యరాయ్‌ ఎన్నోసార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మణిరత్నం అడిగితే ఈ స్టార్‌లు ఇద్దరూ కాదనరని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ పైకి వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: ఆ టీవీ సీరియల్ అంటే నయనతారకు ఎందుకంత ఇష్టం ??

బాలీవుడ్‌ ‘రామాయణ’పై అఫీషియల్ అప్‌డేట్

49 ఏళ్ళకి పెళ్ళికి సిద్ధమైన టాప్‌ హీరోయిన్‌

అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్.. కేరళ సర్కారు కీలక నిర్ణయం

కోల్‌కత్తాలో బైక్ రైడ్ బుక్ చెయ్యడమే తప్పయ్యింది

Published on: Nov 08, 2024 12:39 PM