Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాపకింద నీరులా వచ్చి.. కాటికి దారి చూపిస్తోంది

చాపకింద నీరులా వచ్చి.. కాటికి దారి చూపిస్తోంది

Phani CH
|

Updated on: Oct 29, 2024 | 9:37 PM

Share

ఏపీలో డయేరియా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మొన్న విజయనగరం జిల్లాను వణికించిన డయేరియా.. తాజాగా పల్నాడు జిల్లాలో డయేరియా కేసుల విజృంభణ ఆందోళన రేకెత్తిస్తోంది. దాచేపల్లిలో డయేరియాతో ఇద్దరు మృతి చెందారు. డయేరియా విజృంభణపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో పర్యటించారు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్.

డయేరియా బాధిత కుటుంబాలను పరామర్శించారు యరపతినేని. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే దాచేపల్లిలో డయేరియా సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించింది. అధికారులను అలర్ట్ చేసింది. అటు సీఎం, మంత్రుల ఆదేశాలతో ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కదిలింది. అక్కడి పరిస్థితి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. శానిటేషన్ కార్యక్రమం చేపట్టారు. డయేరియా వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. డయేరియా భారిన పడకుండా ఉండేలా పలు సూచనలు చేస్తున్నారు. దాచేపల్లిలో ప్రజెంట్ బోర్‌నీటిని ఆపేసి.. ట్యాంకర్లలతో నీటిని సరఫరా చేస్తున్నారు అధికారులు. దాచేపల్లి వాసులు వాడుతున్న నీటిని టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించారు. రిపోర్టు రాగానే చర్యలు చేపట్టనున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతరిక్ష యాత్రకు రెడీనా ?? టికెట్‌ ధర రూ. 1.77 కోట్లు మాత్రమే

తండ్రి వెనుక కూర్చోగా స్కూటర్ నడుపుతున్న బాలిక !! మండిపడుతున్న నెటిజన్లు

అక్కోయ్.. ఫస్ట్ శాలరీనా పిచ్చ హ్యాపీగా ఉన్నట్టున్నావుగా

డేజంర్‌ బెల్స్ మోగిస్తున్న డ్రై ఐ సిండ్రోమ్

ఓర్నీ.. అరచేతిని స్కాన్ చేసి పేమెంట్ !! చైనాలో కొత్త టెక్నాలజీ !!