డేజంర్ బెల్స్ మోగిస్తున్న డ్రై ఐ సిండ్రోమ్
ఢిల్లీ, ఎన్సిఆర్తో సహా అనేక రాష్ట్రాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. చలికాలం సమీపించేకొద్దీ, అనేక రాష్ట్రాల్లో దీపావళి పటాసులు కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రజలు అనేక శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ కాలుష్యం వల్ల వృద్ధులతో పాటు చిన్న పిల్లలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.
కాలుష్యం కారణంగా డ్రై ఐ సిండ్రోమ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. డ్రై ఐ సిండ్రోమ్ ఒకప్పుడు పిల్లల్లో కనిపించేది. కానీ ఇప్పుడు ఇది యువత, వృద్ధులలో కూడా కనిపిస్తోంది. స్క్రీన్స్ ను ఎక్కువగా ఉపయోగించడం, ఇండోర్ ఎయిర్ కండిషన్లో ఎక్కువ కాలం ఉండటం వంటి కారణాలు ఈ సమస్యకు కారణమవుతున్నాయి. కళ్లు పొడిబారడంతోపాటు కళ్లల్లో తగినంతగా కన్నీళ్లు పుట్టకపోవడాన్నే డ్రై ఐ సిండ్రోమ్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా, కళ్ళు ఎర్రబడటం, కళ్ళు మండడం, కళ్ళు మసకబారడం వంటివి సంభవిస్తాయి. ఎక్కువగా స్క్రీన్లను చూడటం దీనికి కారణమని భావిస్తుంటారు. కానీ ఇప్పుడు నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, చెడు గాలి కూడా దీనికి కారణమవుతున్నాయి. దీంతో పాటు ఎప్పుడూ ఎయిర్ కండిషన్తో మూసి ఉన్న గదుల్లో ఉండడం కూడా ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. ఎయిర్ కండిషన్డ్ రూమ్లో ఎక్కువసేపు ఉండడం వల్ల కళ్లు పొడిబారడంతోపాటు తేమ ఆరిపోతుంది. ప్రజలలో డ్రై ఐ సిండ్రోమ్ పెరగడానికి ఇవే ప్రధాన కారణాలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. అరచేతిని స్కాన్ చేసి పేమెంట్ !! చైనాలో కొత్త టెక్నాలజీ !!
తెలంగాణలో ఈసారి శీతాకాలం.. వణికిస్తుందా ?? ఉక్కపోస్తుందా ??
అమెరికాలో 170 ఏళ్లుగా మంగళవారమే.. ఎందుకు ఎన్నికలు జరుపుతున్నారు ??
ఒకే కుటుంబంలో 5 రోజుల్లో ఐదుగురిని కాటేసిన ఒకే పాము !!
మందేసి.. దోసె తింటే మీ పని మటాష్ !! ఇప్పటికైనా జాగ్రత్తపడండి
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

