ఒకే కుటుంబంలో 5 రోజుల్లో ఐదుగురిని కాటేసిన ఒకే పాము !!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వింత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హాపూర్ జిల్లాలోని సదర్పూర్ గ్రామంలో ఓ మిస్టరీ పాము భయం పట్టుకుంది. ఈ పాము గత ఐదు రోజుల్లో ఐదుగురిని కాటేసింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. చీకటి పడితే చాలు ఈ పాము దాడి చేసి అదృశ్యమవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
పాము శబ్ధం వింటేనే ఆ గ్రామం ఉలిక్కిపడుతోంది. హాపూర్లోని సదర్పూర్ గ్రామంలో పాము కాటుకు గురైన ఐదుగురిలో ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇది పాము ప్రతీకారంగానే భావిస్తున్నారు. వారిలో కొడుకు, కూతురు, తల్లి నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురూ చనిపోయారు. ఆ తర్వాత పాము మరో ఇద్దరిని బలితీసుకుంది. ఈ పామును ఇప్పుడు అటవీ శాఖ బృందం పట్టుకుంది. అయితే గ్రామంలో విషసర్పాలు ఉండటంతో అందరూ భయంతో వణికిపోతున్నారు. సాయంత్రం కాగానే పాము.. గుంతలోంచి బయటకు వచ్చి గ్రామస్తులను బలి తీసుకుంటోందని చెబుతున్నారు. పాము భయంతో సదర్పూర్ గ్రామ ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మందేసి.. దోసె తింటే మీ పని మటాష్ !! ఇప్పటికైనా జాగ్రత్తపడండి
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

