వాగులో చిక్కుకున్న వ్యక్తిని గ్రామస్థులు ఎలా కాపాడారో చూడండి
మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ, దాని ప్రభావంతో నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. లింగాల మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు చిక్కుకుపోయింది. అందులో చిక్కుకున్న వ్యక్తిని గ్రామస్థులు తాడు సహాయంతో సురక్షితంగా రక్షించారు. కారు కొట్టుకుపోతుండగా, గ్రామస్థుల సమయస్ఫూర్తితో ఒక వ్యక్తి ప్రాణాలు నిలిచాయి.
మోంతా తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం కొనసాగుతోంది. గత మూడు రోజులుగా ఉత్కంఠకు గురిచేసిన ఈ తుఫాన్ నర్సాపురం దగ్గర రాత్రి 11:30 గంటల నుంచి 12:30 గంటల మధ్య తీరం దాటింది. వాతావరణ శాఖ అధికారుల ప్రకారం, దీని ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఈ మోంతా తుఫాన్ ప్రభావంతో నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లింగాల మండలంలోని అంబటిపల్లి, అవుసలపల్లి మధ్య ప్రవహిస్తున్న ఒక వాగు ఉధృతంగా ప్రవహించింది. ఈ వాగులో ఒక కారు చిక్కుకుపోగా, అందులోని వ్యక్తి ప్రమాదంలో పడ్డాడు. అదృష్టవశాత్తు, అక్కడ ఉన్న గ్రామస్థులు ఈ ఘటనను గుర్తించారు. వారు వెంటనే స్పందించి, తాడు సహాయంతో వాగులో చిక్కుకున్న వ్యక్తిని ఒడ్డుకు తీసుకువచ్చి కాపాడారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ డబ్బు కాదు.. పరామర్శ కావాలి
తీరం దాటిన మొంథా తుఫాను.. అల్లకల్లోలంగా సముద్రాలు
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే ??
రైలు నుండి జారిపడిన యువకుడు.. క్షణంలో..
వామ్మో.. ఈ దున్నపోతు ధర రూ.23 కోట్లట !! ఈ గుర్రం ధర రూ.15 కోట్లట
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

