24 ప్రీమియం ఎకానమీ సీట్లతో.. ఎయిరిండియా సరికొత్త విమానం..
ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ అధీనంలోకి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. విమానాలు ఆధునీకరణ, విమానాల్లో సదుపాయాలు, సీట్లు సహా అన్నింటిలోనూ సరికొత్త విధానాలతో విమాన సేవలను మెరుగుపరుస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో నారోబాడీ విమానాల్లోనూ 3 తరగతుల సీట్లను అమర్చారు.
ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ అధీనంలోకి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. విమానాలు ఆధునీకరణ, విమానాల్లో సదుపాయాలు, సీట్లు సహా అన్నింటిలోనూ సరికొత్త విధానాలతో విమాన సేవలను మెరుగుపరుస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో నారోబాడీ విమానాల్లోనూ 3 తరగతుల సీట్లను అమర్చారు. ప్రీమియం ఎకానమీ సీట్లతో కూడిన ఈ విమానం ఎయిర్ ఇండియాలో చేరింది. ఈ నారోబాడీ విమానంలో 8 విలాసవంతమైన బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్కు భిన్నంగా, సరికొత్త లివరీతో ఈ విమానాన్ని తీర్చిదిద్దారు. ఫ్రాన్స్లోని ఎయిర్బస్ తయారీ ప్లాంటు నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఈ విమానం ఆదివారమే చేరింది. దేశీయ మార్గాల్లో ఈ విమానాన్ని ఆగస్టు నుంచి నడపనున్నారు. ఇప్పటికే ఎయిర్బస్ 320 నియో విమానాలు 3 ఎయిరిండియా దగ్గర ఉన్నా, అవన్నీ పాత డిజైన్ ప్రకారం రూపొందించినవే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
15 రోజుల పసికందును బతికుండగానే !! పాకిస్థాన్లో ఘటన
40 మందితో తాళి కట్టించుకున్న నిత్య పెళ్లి కూతురు
బంగ్లా పై నుంచి చూస్తున్న మహిళకు బుల్లెట్ గాయం
అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

