బొలీవియాలో నిత్యానంద లీలలు… 20 మంది అరెస్ట్ వీడియో
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరోసారి వార్తల్లోకెక్కారు. లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన నిత్యానంద, ఇప్పుడు బొలీవియాలో భూ కుంభకోణానికి తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశం కాని దేశంలో తన 'కైలాస' సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు నిత్యానంద ప్రయత్నించిన వైనం బయటపడింది. నిత్యానందకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది బొలీవియా ప్రభుత్వం. 20 మంది నిత్యానంద అనుచరులను బొలీవియా అరెస్ట్ చేసింది. ట్రంప్ స్టయిల్లో వారిని స్వదేశాలకు పంపించింది. అంటే భారత్, అమెరికా, స్వీడన్, చైనాకు డిపోర్ట్ చేసింది. అంతేకాదు, ఈక్వెడార్ తీరంలో నిత్యానంద ఏర్పాటుచేసిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని బొలీవియా ప్రకటించింది.
బొలీవియా తెగల నుంచి దీవిని 25 ఏళ్లకు లీజుకు ఒప్పందం చేసుకుని, వెయ్యేళ్ల లీజు అని చెప్పుకున్నారు కైలాస ప్రతినిధులు. ఈ భూమి విస్తీర్ణం ఢిల్లీ నగరం కన్నా మూడురెట్లు ఎక్కువ. ఈ భూమి కోసం నిత్యానంద బ్యాచ్ భారీ స్కెచ్ గీసిందని న్యూయార్క్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. గత ఏడాది బొలీవియాలో కార్చిచ్చును నియంత్రించడంలో నిత్యానంద బ్యాచ్ కొంత సాయపడింది. బొలీవియాకు సాయం చేసేందుకు ఏటా రెండు లక్షల డాలర్లు ఇస్తామని ఆఫర్ చేశారు. వాస్తవానికి అక్కడ మైనింగ్పై నిత్యానంద అనుచరులు కన్నేసినట్టు తెలుస్తోంది. తొలుత ఈ స్కామ్ను స్థానిక మీడియా బట్టబయలు చేసింది. కైలాస ప్రతినిధులు తమను మోసం చేశారని బొలీవియా తెగలు ఆరోపించాయి. ఈ వ్యవహారాన్ని భూకబ్జాగా పరిగణించింది బొలీవియా ప్రభుత్వం. గతవారం 20 మంది నిత్యానంద అనుచరులను అరెస్ట్ చేశారు. నిత్యానంద స్కామ్పై పూర్తిస్థాయిలో న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించడంతో ప్రపంచానికి తెలిసింది.
మరిన్ని వీడియోల కోసం
సింహంతో బాలుడి పరాచకాలు.. వీడియో
భూదేవి చెప్పిందంటూ.. సజీవ సమాధికి యత్నించిన వ్యక్తి చివరికి వీడియో
పర్యాటకులకు కనిపించిన అద్భుతం.. పులి ఏం చేసిందంటే?
కుంభమేళా మోనాలిసాకు షాక్..డైరెక్టర్ అరెస్ట్ తో అయోయమంలో బ్యూటీ
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
