AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: అంతా రామమయం.. రామనామస్మరణతో మార్మోగుతున్న అయోధ్య.. లైవ్

Ayodhya Ram Mandir: అంతా రామమయం.. రామనామస్మరణతో మార్మోగుతున్న అయోధ్య.. లైవ్

Anil kumar poka
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 22, 2024 | 12:46 PM

Share

ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశాలమైన వీధులు, కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, రంగురంగుల దీపాలు అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఎక్కడ చూసినా జై శ్రీరాం అని రాసి ఉండడంతో పాటు రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది. ఆలయాన్ని పూర్తిగా విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. రాత్రి‌‍ళ్లు బంగారు వర్ణంలో గుడి వెలిగిపోతోంది. బయట గేటు దగ్గర కూడా పూలతో అలంకరించారు.

ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశాలమైన వీధులు, కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, రంగురంగుల దీపాలు అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఎక్కడ చూసినా జై శ్రీరాం అని రాసి ఉండడంతో పాటు రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది. ఆలయాన్ని పూర్తిగా విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. రాత్రి‌‍ళ్లు బంగారు వర్ణంలో గుడి వెలిగిపోతోంది. బయట గేటు దగ్గర కూడా పూలతో అలంకరించారు. ప్రధాన రహదారి నుంచి గుడికి వెళ్లే దారిలో పది అడుగుల ఎత్తు వరకు పూలతో అలంకరించారు. రాముడితో పాటు వివిధ చిత్రాలను.. జైశ్రీరాం అనే పేరును కూడా పూలతో రూపొందించారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో భాగంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన లేజర్‌ షో అందరిని ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు, భారీ సంఖ్యలో మోహరించిన భద్రతా బలగాలతో అయోధ్య సందడిగా కనిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Jan 22, 2024 07:20 AM