Ayodhya Ram Mandir: అంతా రామమయం.. రామనామస్మరణతో మార్మోగుతున్న అయోధ్య.. లైవ్
ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశాలమైన వీధులు, కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, రంగురంగుల దీపాలు అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఎక్కడ చూసినా జై శ్రీరాం అని రాసి ఉండడంతో పాటు రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది. ఆలయాన్ని పూర్తిగా విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. రాత్రిళ్లు బంగారు వర్ణంలో గుడి వెలిగిపోతోంది. బయట గేటు దగ్గర కూడా పూలతో అలంకరించారు.
ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశాలమైన వీధులు, కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, రంగురంగుల దీపాలు అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఎక్కడ చూసినా జై శ్రీరాం అని రాసి ఉండడంతో పాటు రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది. ఆలయాన్ని పూర్తిగా విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. రాత్రిళ్లు బంగారు వర్ణంలో గుడి వెలిగిపోతోంది. బయట గేటు దగ్గర కూడా పూలతో అలంకరించారు. ప్రధాన రహదారి నుంచి గుడికి వెళ్లే దారిలో పది అడుగుల ఎత్తు వరకు పూలతో అలంకరించారు. రాముడితో పాటు వివిధ చిత్రాలను.. జైశ్రీరాం అనే పేరును కూడా పూలతో రూపొందించారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో భాగంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన లేజర్ షో అందరిని ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు, భారీ సంఖ్యలో మోహరించిన భద్రతా బలగాలతో అయోధ్య సందడిగా కనిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!

