క్యాంప్‌ పేరుతో మైనర్ బాలికలపై లైంగిక దాడి

తమిళనాడులో ఓ ప్రైవేటు స్కూలులో ఫేక్ ఎన్ సీసీ క్యాంపు పెట్టి పదమూడు మంది బాలికలను దుండగులు లైంగికంగా వేధించారు. క్యాంపు ఏర్పాటు చేస్తే NCC గుర్తింపు లభిస్తుందని చెప్పిన దుండగుల మాటలకు స్కూలు యాజమాన్యం బోల్తా పడింది. ఎవరినీ విచారించకుండానే క్యాంప్ ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వడం, నిర్వహణ మొత్తం దుండగులకే వదిలివేయడంతో బాలికలు వేధింపులకు గురయ్యారు.

క్యాంప్‌ పేరుతో మైనర్ బాలికలపై లైంగిక దాడి

|

Updated on: Aug 23, 2024 | 9:59 PM

తమిళనాడులో ఓ ప్రైవేటు స్కూలులో ఫేక్ ఎన్ సీసీ క్యాంపు పెట్టి పదమూడు మంది బాలికలను దుండగులు లైంగికంగా వేధించారు. క్యాంపు ఏర్పాటు చేస్తే NCC గుర్తింపు లభిస్తుందని చెప్పిన దుండగుల మాటలకు స్కూలు యాజమాన్యం బోల్తా పడింది. ఎవరినీ విచారించకుండానే క్యాంప్ ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వడం, నిర్వహణ మొత్తం దుండగులకే వదిలివేయడంతో బాలికలు వేధింపులకు గురయ్యారు. క్యాంప్ పూర్తయిన తర్వాత బాలికలు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా.. విషయాన్ని పెద్దది చేయొద్దంటూ వారిని బెదిరించారు. గత నెలలో కృష్ణగిరిలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పిల్లల తల్లిదండ్రులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూలు కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఇద్దరు టీచర్లతో పాటు క్యాంప్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతిపెద్ద సైబర్ మోసం.. రూ. 8.6 కోట్లు నష్టపోయిన హైదరాబాద్‌ వైద్యుడు

3000 ఏళ్లనాటి మొసలి మమ్మీ.. సీటీ స్కాన్ లో సంచలనం

ఏటీఎం దొంగలతో హడలుతున్న విశాఖ..

దొంగతనం చేసి ప్రియురాలితో కలిసి తీర్థయాత్రలు

రోజూ ఈ జ్యూస్‌ తాగండి.. ఫలితం మీకే తెలుస్తుంది

Follow us