ఏటీఎం దొంగలతో హడలుతున్న విశాఖ..

దొంగలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.. అక్కడ.. ఇక్కడ అనే తేడాలేం లేవు... ఎక్కడబడితే అక్కడ.. చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎంత టెక్నాలజీని వాడుతున్నా.. ఏమాత్రం అదురూబెదురూ లేకుండా చోరీలు చేసేస్తున్నారు దొంగలు. చివరికి సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాలను కూడా వదలడంలేదు. తాజాగా.. వరుస చోరీలతో విశాఖను హడలెత్తించారు ఏటీఎం దొంగలు.

ఏటీఎం దొంగలతో హడలుతున్న విశాఖ..

|

Updated on: Aug 22, 2024 | 9:41 PM

దొంగలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.. అక్కడ.. ఇక్కడ అనే తేడాలేం లేవు… ఎక్కడబడితే అక్కడ.. చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎంత టెక్నాలజీని వాడుతున్నా.. ఏమాత్రం అదురూబెదురూ లేకుండా చోరీలు చేసేస్తున్నారు దొంగలు. చివరికి సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాలను కూడా వదలడంలేదు. తాజాగా.. వరుస చోరీలతో విశాఖను హడలెత్తించారు ఏటీఎం దొంగలు. అయితే.. సాధారణంగా దొంగతనాలు జరగడం ఒక ఎత్తయితే.. విశాఖలో జరిగిన ఈ చోరీ మరో ఎత్తు అని చెప్పొచ్చు. 48గంటల్లో మూడు ఏటీఎంలను కొల్లగొట్టి.. సుమారు 50 లక్షలు ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 48 గంటల్లో మూడు ఏటీఎంలలో దొంగతనం చేశారు. సుమారు 50లక్షలు ఎత్తుకెళ్లగా.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకు ఏటీఎంలనే టార్గెట్‌ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొన్న మునగపాకలో ఎస్‌బీఐ ఏటీఎంను కొల్లగొడితే.. నిన్న విశాఖ నగరంలో రెండు ఏటీఎంలను దోచేయడం కలకలం రేపింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దొంగతనం చేసి ప్రియురాలితో కలిసి తీర్థయాత్రలు

రోజూ ఈ జ్యూస్‌ తాగండి.. ఫలితం మీకే తెలుస్తుంది

ఈ టీ రోజూ తాగితే అందం.. ఆరోగ్యం మీ సొంతం

14 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా శివాజీ-లయ

మంటల్లో ఫెర్రీస్‌ వీల్‌.. సందర్శకుల హాహాకారాలు !!

 

 

Follow us