Viral Video: రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి రచ్చ.. పోలీసుని చెప్పుతో కొట్టిన మహిళ.. నెట్టింట్లో వీడియో వైరల్

Viral Video: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నో( Lucknow ) లోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం ( Charabagh Railway Station) పై పోలీసులకు, కొంతమందికి మధ్య జరిగిన గొడవ వీడియో సోషల్ మీడియా(Social Media) లో..

Viral Video: రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి రచ్చ.. పోలీసుని చెప్పుతో కొట్టిన మహిళ.. నెట్టింట్లో వీడియో వైరల్
Woman Beat Policeman
Follow us

|

Updated on: Mar 19, 2022 | 9:38 PM

Viral Video: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నో( Lucknow ) లోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం ( Charabagh Railway Station) పై పోలీసులకు, కొంతమందికి మధ్య జరిగిన గొడవ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతోంది. అందిన సమాచారం ప్రకారం.. ప్లాట్‌ఫారమ్‌పై బట్టలు,    వస్తువుల విషయంపై వాగ్వాదం జరిగిందని.. ఈ వివాదం ఘర్షణకు దారితీసిందని తెలుస్తోంది. ఈ వీడియోలో లక్నో పోలీస్ కమిషనరేట్‌లోని ఓ కానిస్టేబుల్ మహిళను కొడుతుండడం.. ఆ మహిళ కూడా పోలీసును చెప్పుతో కొడుతున్నది కనిపిస్తోంది.

పోలీస్ కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నాడని, తన వస్తువులను తీసుకుని వెళ్లాలని ఓ వ్యక్తిని కోరగా.. ఆ వ్యక్తి పోలీసు చెప్పిన దానికి నిరాకరించడంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారని తెలుస్తోంది. . అదే సమయంలో ఓ మహిళ కూడా కలగజేసుకుంది. పోలీసు ఆ మహిళను గెంటేయడంతో ఆ మహిళ పోలీసును చెప్పుతో కొట్టింది. రక్షణ కోసం RPF మహిళా పోలీసు కూడా జోక్యం చేసుకుంది. ఈ వివాదం చార్‌బాగ్ GRP పోలీసులకు చేరింది. ఇరువర్గాలను వెంటనే జిఆర్‌పి పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. అయితే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని లిఖితపూర్వకంగా  రాసి ఇచ్చారని.. దీంతో ఈ వివాదంపై ఎటువంటి కేసు నమోదు కాలేదన్నారు.

Also Read: Visakha-TTD: విశాఖ‌ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు.. స్వామివారికి వెండి వస్తువులను బహుకరించిన భక్తులు

Realme GT Neo 3: రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఆ ఫీచర్‌తో రానున్న తొలి ఫోన్‌ ఇదే..