AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోర్టు ముందే SIని పరిగెట్టించి కొట్టిన లాయర్లు! గొడవకు కారణం ఏంటంటే..?

వారణాసి కోర్టులో మంగళవారం ఘోర ఘటన జరిగింది. బరగావ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మిథిలేష్ కుమార్‌ను న్యాయవాదులు దారుణంగా కొట్టారు. భూ వివాదం నేపథ్యంలో ఈ దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడి బిహెచ్‌యు ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.

కోర్టు ముందే SIని పరిగెట్టించి కొట్టిన లాయర్లు! గొడవకు కారణం ఏంటంటే..?
Varanasi Court Violence
SN Pasha
|

Updated on: Sep 17, 2025 | 6:00 AM

Share

మంగళవారం వారణాసి కోర్టులో పెద్ద గొడవ జరిగింది. బరగావ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ మిథిలేష్ కుమార్‌ను న్యాయవాదులు వెంబడించి మరీ కొట్టారు. ఇన్‌స్పెక్టర్ మిథిలేష్ కుమార్ ఏదో కేసులో పోలీస్ స్టేషన్‌లోని కానిస్టేబుల్‌తో కోర్టుకు వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో న్యాయవాదులు అతన్ని చూడగానే, వారు అతని వైపు పరిగెత్తి కనికరం లేకుండా కొట్టడం ప్రారంభించారు. ఇన్‌స్పెక్టర్ మిథిలేష్ కుమార్‌ను కాపాడటానికి వెళ్ళిన వారందరూ గాయపడ్డారు. అతన్ని కాపాడే క్రమంలో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు.

ఘటనపై సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు, పారామిలిటరీ బలగాలు కోర్టు వద్దకు చేరుకున్నారు. కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేసి, పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన మిథిలేష్ కుమార్‌ను మొదట జిల్లా ఆసుపత్రికి తరలించారు, తరువాత అక్కడి నుండి బిహెచ్‌యు ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన అక్కడ అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఆయనకు చాలా గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయన భార్య ట్రామా సెంటర్‌కు చేరుకున్నప్పుడు, భర్త పరిస్థితిని చూసి ఆమె కళ్లుతిరిగి పడిపోయారు.

వారణాసి పోలీస్ కమిషనర్ ఈ మొత్తం కేసుపై ఒక ప్రకటన విడుదల చేస్తూ సామాజిక వ్యతిరేక ధోరణులు కలిగిన కొంతమంది న్యాయవాదులు విధుల్లో ఉన్న మా సబ్-ఇన్‌స్పెక్టర్లలో ఒకరిని తీవ్రంగా కొట్టారని అన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అతను BHU ట్రామా సెంటర్‌లో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో మేం అన్ని ఆధారాలు, CCTV ఫుటేజ్‌లను సేకరించాం. ఈ కేసులో నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సెంట్రల్ బార్, బనారస్ బార్ అధికారులు అటువంటి సామాజిక వ్యతిరేక న్యాయవాదులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారని ప్రకటనలో పేర్కొన్నారు.

భూ వివాదమే కారణం!

బరగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురి ఖుర్ద్ గ్రామంలో రెండు వర్గాల మధ్య భూ వివాదం ఉందని చెబుతున్నారు. ఈ భూ వివాదం మోహిత్ సింగ్, ప్రేమ్‌చంద్ మౌర్య మధ్య జరుగుతోంది. సెప్టెంబర్ 13న ఈ భూ వివాదం విషయంలో పోలీసుల ఎదుటే ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. పోలీసులు రెండు వర్గాలను విచారించారు. ఈ సమయంలో ఇన్‌స్పెక్టర్ మిథిలేష్ కుమార్ తనను కొట్టాడని ఒక న్యాయవాది ఆరోపించారు. సెప్టెంబర్ 13న జరిగిన ఈ సంఘటన సెప్టెంబర్ 16న ఇన్‌స్పెక్టర్‌పై దాడికి కారణం అని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!