Viral: కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి కళ్లు తేలేసిన డాక్టర్స్.!

అతడ్ని పరీక్షించిన డాక్టర్లు.. కొన్ని టెస్టులు చేయించాలని సిఫార్సు చేశారు. దీనితో సదరు వ్యక్తి...

Viral: కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి కళ్లు తేలేసిన డాక్టర్స్.!
Doctors Surgery
Follow us

|

Updated on: Jun 23, 2022 | 1:23 PM

ఓ వ్యక్తి.. తన తమ్ముడు జెడ్‌ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంటే.. ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అతడ్ని పరీక్షించిన డాక్టర్లు.. కొన్ని టెస్టులు చేయించాలని సిఫార్సు చేశారు. దీనితో సదరు వ్యక్తి తన తమ్ముడికి అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే స్కానింగ్, ఎండోస్కోపీ చేయించాడు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్‌ను డాక్టర్స్‌కు చూపించాడు. ఆ స్కానింగ్ రిపోర్ట్స్‌ చూసిన డాక్టర్లు ఒక్కసారిగా కళ్లు తేలేసారు.

వివరాల్లోకి వెళ్తే.. బుర్హాన్ డెమిర్ అనే వ్యక్తి.. తన 35 ఏళ్ల తమ్ముడు తీవ్రమైన కడుపు నొప్పి ఉందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అతడికి వైద్యులు కొన్ని పరీక్షలు చేయించాలని సిఫార్సు చేయడంతో.. ఆయా టెస్టులన్నీ చేయిస్తాడు డెమిర్. అనంతరం వచ్చిన స్కానింగ్ రిపోర్ట్స్ చూసి డాక్టర్లకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. రోగి కడుపులో నాణేలు, రాళ్లు, మేకులు, గాజు ముక్కలు.. లాంటివి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. అవి కడుపులోకి ఎలా చేరాయో తెలియక డాక్టర్లు మతిపోయింది. సదరు రోగి అన్నను దీని గురించి ప్రశ్నించగా.. తన తమ్ముడికి ఇలా వస్తువులను మింగే అలవాటుందని చెప్పాడు. డాక్టర్లు వెంటనే రోగికి ఆపరేషన్ చేసి.. ఆ వస్తువులను బయటికి తీశారు. అవన్నీ టేబుల్‌పై పేర్చగా.. మొత్తం 233 వస్తువులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

కాగా, ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందన్న డాక్టర్లు.. ఆ వ్యక్తి మానసిక రోగంతో బాధపడుతున్నాడని.. ఎవరైనా మానసిక నిపుణులకు చూపించాలని బుర్హాన్ డెమిర్‌కు సూచించారు.

Latest Articles