AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్ నీచబుద్ధి .. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి..

పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం (PMO) మరోసారి తన దిగజారుడుతనాన్ని బయటపెట్టుకుంది. కిర్గిస్తాన్‌లో జరిగిన ఎస్‌సీవో (SCO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దిగిన అధికారిక గ్రూప్ ఫొటోలో నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశపూర్వకంగా కట్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పాకిస్తాన్ నీచబుద్ధి .. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి..
Shehbaz Sharif Takes Centre Stage By Cropping Pm Modi From Sco Group Pic
Sharada V
|

Updated on: Sep 02, 2026 | 1:22 PM

Share

ఈ సదస్సులో భారత్, పాకిస్తాన్‌లతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా మొత్తం 10 దేశాల అధినేతలు పాల్గొన్నారు. అందరూ కలిసి దిగిన గ్రూప్ ఫొటోను సాధారణంగా దేశాలన్నీ గౌరవప్రదంగా షేర్ చేస్తాయి. కానీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం మాత్రం ఫొటోలో మోదీ ఉన్న భాగాన్ని కత్తిరించి, కేవలం తమ ప్రధాని ప్రాధాన్యతను హైలైట్ చేసేలా ఓవరాక్షన్‌  చేసింది.

అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరమైన మర్యాదలు పాటించాల్సిన ఒక దేశ అధినేత కార్యాలయం ఇలా వ్యవహరించడం పట్ల రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శత్రుభావంతో కనీస సాంప్రదాయాలను కూడా పాటించకుండా పాకిస్తాన్ మరోసారి తన సంకుచిత మనస్తత్వాన్ని నిరూపించుకుందని నిపుణులు మండిపడుతున్నారు.

అంతర్జాతీయ వేదికలపై దేశాల మధ్య ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, సదస్సులు,  అధికారిక సమావేశాల సమయంలో కనీస దౌత్య మర్యాదలు పాటించడం ఆనవాయితీ. కానీ, పాకిస్తాన్ మాత్రం ఇలాంటి ప్రతిష్టాత్మక సందర్భాలను కూడా తమ సంకుచిత రాజకీయాలకు వేదికగా మలచుకోవడం గమనార్హం.

కిర్గిస్తాన్‌లో జరిగిన ఎస్‌సీవో (SCO) శిఖరాగ్ర సదస్సుకు హాజరైన దేశాల అధినేతల అధికారిక గ్రూప్ ఫొటోలో నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీని తొలగించి మరీ పాక్ ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వారి అపరిపక్వతకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక దేశ ప్రధాని కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఇలా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఎలాంటి సంకోచాలు లేకుండా సదస్సుకు సంబంధించిన అన్ని అధికారిక చిత్రాలను, ఇతర ప్రపంచ నేతలతో కలిసి ఉన్న ఫొటోలను తమ అధికారిక సాషల్ మీడియా ఖాతాల ద్వారా హుందాగా పంచుకున్నారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ వేదికపైనే రాజీ లేని వైఖరిని స్పష్టం చేస్తూ, దౌత్యపరమైన విషయాల్లో భారత్ ఎప్పుడూ ఒక బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరిస్తుందని మరోసారి నిరూపించుకున్నారు.

పాక్ ప్రధాని కార్యాలయం చేసిన ఈ  చర్యకు సోషల్ మీడియా వేదికగా  నెటిజన్లు గట్టిగానే బదులిస్తున్నారు. పాకిస్తాన్ పోస్ట్ చేసిన ఆ మార్ఫింగ్ ఫొటోను తిప్పికొడుతూ, అసలు ఒరిజినల్ ఫొటోలతో సహా వివిధ క్రియేటివ్ మీమ్స్‌తో ఆ పోస్ట్ కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కిస్తాన్ ప్రధాని కార్యాలయం (PMO) మరోసారి తన దిగజారుడుతనాన్ని బయటపెట్టుకుంది. కిర్గిస్తాన్‌లో జరిగిన ఎస్‌సీవో (SCO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దిగిన అధికారిక గ్రూప్ ఫొటోలో నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశపూర్వకంగా కట్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సదస్సులో భారత్, పాకిస్తాన్‌లతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా మొత్తం 10 దేశాల అధినేతలు పాల్గొన్నారు. అందరూ కలిసి దిగిన గ్రూప్ ఫొటోను సాధారణంగా దేశాలన్నీ గౌరవప్రదంగా షేర్ చేస్తాయి. కానీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం మాత్రం ఫొటోలో మోదీ ఉన్న భాగాన్ని కత్తిరించి, కేవలం తమ ప్రధాని ప్రాధాన్యతను హైలైట్ చేసేలా ఓవరాక్షన్‌  చేసింది.

అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరమైన మర్యాదలు పాటించాల్సిన ఒక దేశ అధినేత కార్యాలయం ఇలా వ్యవహరించడం పట్ల రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శత్రుభావంతో కనీస సాంప్రదాయాలను కూడా పాటించకుండా పాకిస్తాన్ మరోసారి తన సంకుచిత మనస్తత్వాన్ని నిరూపించుకుందని నిపుణులు మండిపడుతున్నారు.

అంతర్జాతీయ వేదికలపై దేశాల మధ్య ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, సదస్సులు,  అధికారిక సమావేశాల సమయంలో కనీస దౌత్య మర్యాదలు పాటించడం ఆనవాయితీ. కానీ, పాకిస్తాన్ మాత్రం ఇలాంటి ప్రతిష్టాత్మక సందర్భాలను కూడా తమ సంకుచిత రాజకీయాలకు వేదికగా మలచుకోవడం గమనార్హం.

కిర్గిస్తాన్‌లో జరిగిన ఎస్‌సీవో (SCO) శిఖరాగ్ర సదస్సుకు హాజరైన దేశాల అధినేతల అధికారిక గ్రూప్ ఫొటోలో నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీని తొలగించి మరీ పాక్ ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వారి అపరిపక్వతకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక దేశ ప్రధాని కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఇలా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఎలాంటి సంకోచాలు లేకుండా సదస్సుకు సంబంధించిన అన్ని అధికారిక చిత్రాలను, ఇతర ప్రపంచ నేతలతో కలిసి ఉన్న ఫొటోలను తమ అధికారిక సాషల్ మీడియా ఖాతాల ద్వారా హుందాగా పంచుకున్నారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ వేదికపైనే రాజీ లేని వైఖరిని స్పష్టం చేస్తూ, దౌత్యపరమైన విషయాల్లో భారత్ ఎప్పుడూ ఒక బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరిస్తుందని మరోసారి నిరూపించుకున్నారు.

పాక్ ప్రధాని కార్యాలయం చేసిన ఈ  చర్యకు సోషల్ మీడియా వేదికగా  నెటిజన్లు గట్టిగానే బదులిస్తున్నారు. పాకిస్తాన్ పోస్ట్ చేసిన ఆ మార్ఫింగ్ ఫొటోను తిప్పికొడుతూ, అసలు ఒరిజినల్ ఫొటోలతో సహా వివిధ క్రియేటివ్ మీమ్స్‌తో ఆ పోస్ట్ కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Pm Modi Sco Group Picture

Pm Modi Sco Group Picture

ఒకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి సంకుచిత భావాలు లేకుండా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సహా అందరితో ఉన్న గ్రూప్ ఫొటోలను తమ అధికారిక ఖాతాలలో హుందాగా షేర్ చేసి నిజమైన నాయకత్వ లక్షణాలను చాటుకున్నారు. మరోవైపు పాకిస్తాన్ మాత్రం కేవలం రాజకీయ లబ్ది కోసం, దేశంలోని ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి చిన్నచిన్న కుయుక్తులకు పాల్పడుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై చిన్నచూపు చూసేలా పాక్ ప్రభుత్వ సంస్థలే ఇలా దిగజారి ప్రవర్తించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి సంకుచిత భావాలు లేకుండా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సహా అందరితో ఉన్న గ్రూప్ ఫొటోలను తమ అధికారిక ఖాతాలలో హుందాగా షేర్ చేసి నిజమైన నాయకత్వ లక్షణాలను చాటుకున్నారు. మరోవైపు పాకిస్తాన్ మాత్రం కేవలం రాజకీయ లబ్ది కోసం, దేశంలోని ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి చిన్నచిన్న కుయుక్తులకు పాల్పడుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై చిన్నచూపు చూసేలా పాక్ ప్రభుత్వ సంస్థలే ఇలా దిగజారి ప్రవర్తించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

Follow Us
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
చనిపోయేలోపు స్వర్గాన్ని చూడాలనుకుంటే..పంచ కేదారాలలో పవిత్రమైన
చనిపోయేలోపు స్వర్గాన్ని చూడాలనుకుంటే..పంచ కేదారాలలో పవిత్రమైన
10 సిక్సర్లు, 7 ఫోర్లతో బీభత్సం.. అభిషేకే షాకయ్యాడుగా
10 సిక్సర్లు, 7 ఫోర్లతో బీభత్సం.. అభిషేకే షాకయ్యాడుగా