Ramakoti: 35కోట్ల సార్లు ‘రామ’నామం.. వందల పుస్తకాలు ఫుల్.. వేల పెన్నులు నిల్..

|

Sep 12, 2024 | 8:34 PM

అందుకే గత 35 ఏళ్లుగా ఎన్నో పుస్తకాల్లో రాముడి పేరు రాస్తూ వస్తున్నాడు. ఇప్పటికి 35 కోట్ల సార్లు రామనామాన్ని భక్తితో లిఖించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా రామ నామం రాయడం మర్చిపోడు.. ప్రపంచ శాంతి కోసం రామనామాన్ని రచిస్తున్నట్లు శంభు తెలిపారు.

Ramakoti: 35కోట్ల సార్లు ‘రామ’నామం.. వందల పుస్తకాలు ఫుల్.. వేల పెన్నులు నిల్..
Ramakoti
Follow us on

ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక వ్యక్తి నిజమైన రామ భక్తుడు అనిపించుకున్నాడు. రామనామాన్ని 35 కోట్ల సార్లు తన చేతులతో లిఖించాడు. ఇందుకోసం అతడు గత 35 ఏళ్లుగా రామనామం రాస్తూనే ఉన్నాడు. అతడిలోని రామ భక్తి..రాష్ట్రంలోనే కాదు..దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ రామభక్తుడి పేరు శంభు దయాళ్. ఉత్తరాఖండ్‌లోని అల్మోడా జిల్లాలోని మౌలేఖల్ గ్రామ నివాసి. చిన్న టీ దుకాణం నడుపుతున్న దయాళ్ సూర్య కుటుంబానికి చెందిన రాముడికి స్వచ్ఛమైన భక్తుడు. అతను 35 కోట్ల కంటే ఎక్కువ సార్లు రామ నామాన్ని వ్రాసాడు. ఆధునిక కాలంలో రాముడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా ప్రజలు అభివర్ణించారు.

జీవనోపాధి కోసం చిన్న టీ దుకాణం నడుపుతున్న శంభు దయాళ్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు వికలాంగులు. ఉదార స్వభావి అయిన శంభు తన దుకాణానికి వచ్చే పేదలు, కవులు టీ తాగితే డబ్బులు అడగడు. 35 ఏళ్లుగా రామనామ జపం చేస్తున్నాడు. శంభు దయాళ్‌కు రాముడిపై అమితమైన భక్తి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా రామభక్తి మాత్రం కొంచెమైనా తగ్గలేదు.

అందుకే గత 35 ఏళ్లుగా ఎన్నో పుస్తకాల్లో రాముడి పేరు రాస్తూ వస్తున్నాడు. ఇప్పటికి 35 కోట్ల సార్లు రామనామాన్ని భక్తితో లిఖించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా రామ నామం రాయడం మర్చిపోడు.. ప్రపంచ శాంతి కోసం రామనామాన్ని రచిస్తున్నట్లు శంభు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..