Paytm Offer: పేటీఎం బంపర్ ఆఫర్.. డబ్బులు చెల్లించకుండానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..
Indian Railways: పేటీఎం వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్త. ఇప్పుడు మీ వద్ద డబ్బు లేకపోయినా.. మీరు ట్రైన్లో ప్రయాణించవచ్చు. డబ్బులు చెల్లించకుండానే టికెట్ కొనుగోలు చేయొచ్చు. అవును మీరు విన్నది నిజంగా నిజం. పేటీఎం తన వినియోగదారుల కోసం అదిరిపోయే స్కీమ్ తీసుకువచ్చింది. ‘Book Now Pay Later’ అంటూ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం.. ఐఆర్సీటీసీ టికెటింగ్ సర్వీస్లో టికెట్ బుక్ చేసుకునే పేటీఎం వినియోగదారులు.. తమ అకౌంట్లో డబ్బులు లేకపోయినప్పటికీ.. టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్.. పేటీఎం పోస్ట్పెయిడ్ వినియోగదారులు ఐఆర్సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని.. ఆ తరువాత డబ్బులు చెల్లించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ స్కీమ్ రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి అద్భుత అవకాశంగా చెప్పొచ్చు.
Most Read Stories