AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఓరి దేవుడా.. మత్స్యకారుల వలకు చిక్కిన మర్మమైన చేప.. ఇది కనిపిస్తే పెను వినాశనం తప్పదా..?

తెల్లారింది.. ఎప్పటిలానే మత్స్యకారులంతా చేపలు పట్టడానికి ఉదయాన్నే సముద్రంలోకి వెళ్లారు.. వందకు పైగా పడవల్లో అంతా సందడిగా చేపలు పడుతున్నారు.. ఈ క్రమంలోనే.. బాగా లోతులో చేపలు పడుతుండగా.. వారి వలలో అరుదైన సముద్రపు చేప చిక్కింది. ఆ ప్రాంతంలో మొట్టమొదటి సారి ఆ చేపను చూసిన మత్స్యకారుల భయపడుతున్నారు.

Viral: ఓరి దేవుడా.. మత్స్యకారుల వలకు చిక్కిన మర్మమైన చేప.. ఇది కనిపిస్తే పెను వినాశనం తప్పదా..?
Doomsday Fish
Shaik Madar Saheb
|

Updated on: Oct 07, 2025 | 8:07 PM

Share

తెల్లారింది.. ఎప్పటిలానే మత్స్యకారులంతా చేపలు పట్టడానికి ఉదయాన్నే సముద్రంలోకి వెళ్లారు.. వందకు పైగా పడవల్లో అంతా సందడిగా చేపలు పడుతున్నారు.. ఈ క్రమంలోనే.. బాగా లోతులో చేపలు పడుతుండగా.. వారి వలలో అరుదైన సముద్రపు చేప చిక్కింది. ఆ ప్రాంతంలో మొట్టమొదటి సారి ఆ చేపను చూసిన మత్స్యకారుల భయపడుతున్నారు. ఇది విపత్తుకు సంకేతం అంటూ పేర్కొంటుండటం.. ఆందోళన కలిగిస్తోంది. వివరాల ప్రకారం.. రామేశ్వరం సమీపంలోని పాంబన్‌లోని మన్నార్ గల్ఫ్‌లో ఆదివారం వందకు పైగా పడవల్లో మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లారు. చేపలు పట్టిన తర్వాత వారు ఒడ్డుకు తిరిగి వచ్చినప్పుడు, వారి వలలలో ఒక అరుదైన సముద్ర చేప కనిపించింది.. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.. ఈ చేప ‘డూమ్స్‌డే ఫిష్’ అని పిలువబడే ఒక ఫిన్ ఫిష్… దాదాపు 10 కిలోల బరువు, 5 అడుగుల పొడవు ఉన్న ఈ చేప మొదటిసారిగా మన్నార్ గల్ఫ్‌లో వలలో చిక్కుకుంది.. దీంతో పంబన్, పరిసర ప్రాంతాల ప్రజలు దీనిని ఆసక్తిగా చూశారు.

ఈ ఆకర్షణీయంగా కనిపించే చేప నారింజ రెక్కలతో పొడవైన, పట్టీ లాంటి శరీరాన్ని కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా ఉష్ణమండల సముద్రాలలో మాత్రమే కనిపించే అరుదైన చేప జాతి. ఇది ప్రపంచవ్యాప్తంగా గరిష్టంగా 16 మీటర్లు (సుమారు 52 అడుగులు) పొడవు వరకు పెరుగుతుందని చెబుతారు.

ఈ చేప సాధారణంగా లోతైన సముద్ర జీవి.. ఇది సముద్ర ఉపరితలానికి చేరుకోవడం చాలా అరుదు. అయితే, ఇది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. దీని తరువాత, జపాన్‌తో సహా కొన్ని ఆసియా దేశాలలో, ఈ చేప కొట్టుకుపోవడం లేదా వలలో చిక్కుకోవడం విపత్తుకు సూచనగా పరిగణిస్తారు.. ముఖ్యంగా, భూకంపాలు – సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని వారు పేర్కొంటుంటారు..

అందుకే ఈ చేపకు ‘డూమ్స్‌డే ఫిష్’ అనే మర్మమైన పేరు పెట్టారు. దీనిని పట్టుకోవడం చాలా మందిలో భయాన్ని కలిగించింది. ముఖ్యంగా పంబన్‌లో ఇలాంటి చేపను పట్టుకోవడం ఇదే మొదటిసారి.. కాబట్టి, మత్స్యకారులలో కొంత ఆందోళన నెలకొంది.

ఈ పుకార్లపై మత్స్య శాఖ అధికారులు స్పందించారు.. “ఫిన్ ఫిష్ అరుదైన – లోతైన సముద్ర చేప జాతి. అవి వివిధ కారణాల వల్ల ఒడ్డుకు రావచ్చు. అయితే, దీనిని విపత్తుకు సంకేతంగా పరిగణించడం పూర్తిగా మూఢనమ్మకం. ఈ నమ్మకానికి మద్దతు ఇవ్వడానికి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు” అని అన్నారు. అయితే.. అధికారుల వివరణతో ప్రజలు మరియు మత్స్యకారులు ఉపశమనం పొందారు.. ఇటువంటి సంఘటనలను శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. మూఢనమ్మకాలను అస్సలు నమ్మోద్దంటూ సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..