AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వేలో అద్భుతం.. నాలుగు దిక్కుల నుండి రైళ్లు కలిసే డైమండ్ క్రాసింగ్ ..ఎక్కడుందో తెలుసా..?

భారతీయ రైల్వేలు ఎంతోమందిని కలుపుతున్నాయి. అందుకే దీనిని మన దేశం జీవనాడిగా పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రజలను అనుసంధానించడమే కాకుండా భావోద్వేగాలు, సంస్కృతులు, కలలను కూడా కలుపుతుంది. కానీ, నాలుగు దిశల నుండి రైళ్లు ఒకేసారి కలిస్తే ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది చాలా ప్రమాదకరమైనదిగా అనిపిస్తుంది.. కానీ, ఆశ్చర్యకరంగా మన దేశంలో ఒక అద్భుతమైన స్టేషన్ ఉంది.

రైల్వేలో అద్భుతం.. నాలుగు దిక్కుల నుండి రైళ్లు కలిసే డైమండ్ క్రాసింగ్ ..ఎక్కడుందో తెలుసా..?
Diamond Railway Crossing
Jyothi Gadda
|

Updated on: Nov 07, 2025 | 9:07 PM

Share

నేడు భారతీయ రైల్వేలు కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదు.. దేశం గుండె చప్పుడు. ప్రతి రోజూ లక్షలాది రైళ్లు పట్టాలపై తిరుగుతున్నప్పుడు భారతదేశం మొత్తం ఐక్యంగా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. కొందరు పనికి వెళ్తుంటారు. మరికొందరు ప్రయాణాలు చేస్తారు. ఇంకొందరు తమకు నచ్చిన ప్రదేశాలను చూసేందుకు వెళ్తుంటారు. భారతీయ రైల్వేలు వారందరినీ కలుపుతున్నాయి. అందుకే దీనిని మన దేశం జీవనాడిగా పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రజలను అనుసంధానించడమే కాకుండా భావోద్వేగాలు, సంస్కృతులు, కలలను కూడా కలుపుతుంది. కానీ, నాలుగు దిశల నుండి రైళ్లు ఒకేసారి కలిస్తే ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది చాలా ప్రమాదకరమైనదిగా అనిపిస్తుంది.. కానీ, ఆశ్చర్యకరంగా మన దేశంలో ఒక అద్భుతమైన స్టేషన్ ఉంది. అక్కడ రైళ్లు అన్ని దిశల నుండి వస్తాయి. అయినప్పటికీ ఎప్పుడూ ఎదురు పడలేదు. ఇక్కడ నాలుగు దిక్కుల నుండి వచ్చే రైళ్లు ఒకే సమయంలో వెళతాయి. కానీ, ఎప్పుడూ ఢీకొనవు. ఈ ప్రదేశం నిజంగా దేశ రైల్వే ఇంజనీరింగ్‌లో ప్రకాశవంతమైన వజ్రంలాంటిది. అది ఎక్కడ ఉందో తెలుసుకుందాం…

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే, అత్యంత ప్రత్యేకమైన రైల్వే జంక్షన్లలో ఒకటి. ఇక్కడ, దేశంలోని నాలుగు ప్రధాన రైల్వే మార్గాలు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమం నుండి వస్తాయి. కానీ, ఎలాంటి ప్రమాదాలు ఢీకొనే అవకాశాలు లేకుండా పట్టాలు కలిసిపోయి ఉంటాయి. ఈ దృశ్యం పై నుండి చూసినప్పుడు ఆ పట్టాలు వజ్రం ఆకారంలో కనిపిస్తాయి. అందుకే దీనిని డైమండ్ క్రాసింగ్ అని పిలుస్తారు. భారతదేశంలో నాలుగు దిశల నుండి రైళ్లు ఒకే చోట దాటే ఏకైక రైల్వే పాయింట్ ఇదే. అయినప్పటికీ ఎటువంటి ఢీకొనడం లేదు. ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. రైల్వే ఔత్సాహికులు, ప్రయాణికులు ముఖ్యంగా దీనిని చూడటానికి నాగ్‌పూర్‌ను సందర్శిస్తారు.

నాగ్‌పూర్ గుండా వెళ్ళే ప్రధాన మార్గాలు: ముంబై-హౌరా లైన్ (పశ్చిమ నుండి తూర్పు దిశ)

ఇవి కూడా చదవండి

ఢిల్లీ-చెన్నై లైన్ (ఉత్తరం నుండి దక్షిణం దిశ)

.కాజీపేట-నాగ్‌పూర్ లైన్

నాగ్‌పూర్-ఇటార్సి లైన్

ఈ మార్గాల్లో రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో, గరీబ్ రథ్, మెయిల్, సూపర్‌ఫాస్ట్ రైళ్లు ప్రతిరోజూ నడుస్తాయి. ప్రతిరోజూ వేలాది రైళ్లు ఈ డైమండ్ క్రాసింగ్ గుండా ప్రయాణిస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us