Rice: ప్రతిరోజూ మూడు పూటలా అన్నం తినేవారికి ముఖ్యగమనిక..ఏమౌవుతుందో తెలిస్తే..
అన్నం ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలొస్తాయని తరచూ మనం వింటూనే ఉంటాం..ఎందుకంటే.. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి రోజు అన్నం అతిగా తినడం అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో అన్నం తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. దీనివల్ల శరీరానికి ఎక్కువ ఉపయోగం ఉండదు.

చాలా మందిలో అన్నం అతిగా తినడం వల్ల శరీరక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అన్నం ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. దీని కారణంగా కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అన్నం తింటే శరీర బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అన్నంలో కొవ్వు పరిమాణాలు తక్కువ మోతాదులో లభిస్తాయి. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు అంటున్నారు.
రైస్లో నియాసిన్, థయామిన్, ఐరన్తో పాటు మెగ్నీషియం కూడా అధికంగా లభిస్తాయి. వీటి వల్ల కూడా కొందరిలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. రైస్లో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పరిమాణాలను పెంచుతుంది. అన్నంలోని కార్బోహైడ్రేట్లు మెదడుపై ప్రభావం చూపి.. అనేక రకాల అనారోగ్య సమస్యకు దారి తీస్తుందని చెబుతున్నారు. అలాగే, అన్నంలో చక్కెర పరిమాణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది.
అన్నం ఎక్కువగా తింటే అజీర్ణం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. అన్నం తినడం వల్ల ఉత్పత్తి అయ్యే రసాయనాలు కాలేయాన్ని దెబ్బతిస్తాయి. ఎక్కువ మొత్తంలో అన్నం తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. దీనివల్ల శరీరానికి ఎక్కువ ఉపయోగం ఉండదు. పోషకాలు తగినంత పరిమాణంలో లభించవు. చిన్న చిన్న పనులకే తరచుగా అలసిపోతుంటాం.
మరిన్ని లైఫ్స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








