AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తెల్లారి పొలానికి వచ్చిన రైతుకు కనిపించిన పెద్ద గుంత.. అందులో ఏముందని చూడగా

ఘజియాబాద్‌లోని ముస్సోరీ ప్రాంతంలోని ఒక గ్రామంలో, ప్రజలు అకస్మాత్తుగా పొలంలో ఒక గొయ్యిని చూశారు. గుంతను జాగ్రత్తగా పరిశీలించగా లోపల శివలింగం ఉంది. ఇది అద్భుతంగా భావించి అందరూ శివలింగాన్ని బయటకు తీసి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Viral: తెల్లారి పొలానికి వచ్చిన రైతుకు కనిపించిన పెద్ద గుంత.. అందులో ఏముందని చూడగా
Representative Image
Ravi Kiran
|

Updated on: Dec 30, 2024 | 11:34 AM

Share

ఘజియాబాద్‌లోని ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ పొలం దగ్గర 8 నుంచి 10 అడుగుల లోతులో గొయ్యి పడింది. ఇక అందులో నుంచి శివలింగం ఉద్బవించడంతో స్థానికంగా జనం పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. తెల్లారి పొలం పనులకు వచ్చిన సదరు పొలం యజమాని.. పెద్ద గొయ్యిని చూశాడు. ఇక అందులో శివలింగం ఉన్నట్టు గుర్తించాడు. అసలు ఇంతకీ అదేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. ముబారిక్‌పూర్ దాస్నా గ్రామంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పిడుగుపాటుకు పొలంలో పాతిపెట్టిన పురాతన శివలింగం బయటపడింది. పిడుగు పడి పొలం 8-10 అడుగుల గొయ్యి పడింది. ఇక ఉదయాన్ని తన పొలంలో అంత పెద్ద గొయ్యి కనిపించడంతో.. అందులో ఏముందా అని టార్చ్ వేసి చూశాడు. అతడికి ఓ పురాతన శివలింగం కనిపించింది. పొలంలో ఉన్న గొయ్యి నుంచి ఉద్భవించిన శివలింగానికి మూడు గీతలతో కూడిన త్రిపుండ్ చిహ్నం ఉంది. క్షేత్రంలోని గుంతలో శివలింగం కనిపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. ఊరేగింపులతో పాటు గ్రామ ప్రజలు భజన, కీర్తనలు చేశారు. సమీపంలోని ఆలయంలో శివలింగాన్ని ఉంచి, ఆ శివలింగాన్ని మహిళలు పూజలు చేస్తున్నారు.

Viral

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి