AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇంటి నిర్మాణ పనుల్లోకి వచ్చిన కూలీలు.. అక్కడ కనిపించిన దృశ్యానికి మైండ్ బ్లాంక్!

అతడొక చెప్పుల వ్యాపారి. సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. ముందు రోజు రాత్రి ఇంటి నిర్మాణ పనులు చూసుకుని..

Viral: ఇంటి నిర్మాణ పనుల్లోకి వచ్చిన కూలీలు.. అక్కడ కనిపించిన దృశ్యానికి మైండ్ బ్లాంక్!
Representative Image
Ravi Kiran
|

Updated on: Aug 09, 2022 | 6:00 PM

Share

అతడొక చెప్పుల వ్యాపారి. సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. ముందు రోజు రాత్రి ఇంటి నిర్మాణ పనులు చూసుకుని.. అక్కడే నిద్రపోయాడు. సీన్ కట్ చేస్తే.. తెల్లారేసరికి పనుల్లోకి వచ్చారు కూలీలు. అక్కడ వారికి కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా హడలిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలో చోటు చేసుకుంది. ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రా సమీపంలోని రకాబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సికిందర్ స్థానికంగా ఓ చెప్పుల ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. లాభాలు బాగా రావడంతో అక్కడే ఓ కొత్త ఇల్లు నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. ప్రతీరోజూ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి చేరుకొని.. భోజనం అనంతరం కొత్త ఇంటి పనులను పరిశీలించేవాడు. ఆ తర్వాత అక్కడే నిద్రపోయేవాడు. గురువారం కూడా ఇదే రీతిలో రాత్రి వెళ్లి కొత్త నిర్మిస్తున్న ఇంట్లో పడుకున్నాడు. తెల్లారింది.. కూలీలు ఒక్కొక్కరూ పనుల్లోకి వస్తున్నారు. ఇక వారికి అక్కడ కనిపించిన దృశ్యానికి ఒక్కసారిగా షాక్ తగిలింది. సికిందర్ రక్తపు మడుగులో విగతజీవిగా పడునున్నాడు. అతడి గొంతు కోసినట్లుగా గుర్తులు శరీరం మీద ఉన్నాయి. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఖాకీలు విచారణ చేపట్టారు.

సికిందర్ కొత్త ఇంటి నిర్మాణం పక్కన ఉన్న ఇంటిలో బంటి, సోనూ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారని.. సోనూతో సికిందర్ అఫైర్ పెట్టుకున్నాడని బంటి అనుమానించేవాడని.. ఈ క్రమంలోనే అతడ్ని చంపేసి ఉంటాడని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. దీంతో పరారీలో ఉన్న బంటి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..