AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పీహెచ్‌డీ చేస్తూ చికెన్ పకోడీ అమ్ముతున్న యువకుడు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..! ఏమన్నాడంటే..

చికెన్ పకోడి అమ్ముతూనే పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రీ షేర్ చేశారు. సదరు విద్యార్థిపై ఓ విదేశీయుడు చేసిన వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియోలో ఆ కుర్రాడు విదేశీయుడి ఫోన్ తీసుకున్నప్పుడు..

Viral Video: పీహెచ్‌డీ చేస్తూ చికెన్ పకోడీ అమ్ముతున్న యువకుడు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..! ఏమన్నాడంటే..
Anand Mahindra
Jyothi Gadda
|

Updated on: Oct 05, 2024 | 1:17 PM

Share

దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన ఆనంద్ మహీంద్రా అంటే తెలియని వారు దాదాపు ఎవరూ ఉండరనే చెప్పాలి. వ్యాపారంతో పాటు సోషల్ మీడియాలోనూ ఆయన ఎప్పుడూ చురుకుగా ఉంటారు. తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రజలతో పంచుకుంటుంటారు. వినూత్నంగా ఆలోచన చేసి కొత్త ఆవిష్కరణలు చేసే వారి పట్ల మరింత ఆసక్తిగా ఉంటారు. అలాంటి వారి వివరాలు పోస్టు చేస్తూ వారి గురించి మాట్లాడుతుంటారు. తాజాగా ఆనంద్‌ మహీంద్రా చేసిన ఒక పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. పీహెచ్‌డీ చేస్తూ చికెన్ పకోడీ అమ్ముతున్న యువకుడి వీడియోపై ఆయన స్పందించారు. ఓ వీదేశీ యువకుడు షేర్ చేసిన ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

చెన్నైలో చికెన్ పకోడి అమ్ముతూనే పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రీ షేర్ చేశారు. సదరు విద్యార్థిపై ఓ విదేశీయుడు చేసిన వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియోలో ఆ కుర్రాడు విదేశీయుడి ఫోన్ తీసుకున్నప్పుడు.. తన ఫుడ్ స్టాల్ గురించి చూపిస్తున్నాడు అనుకున్నాడు. కానీ, ఆ కుర్రాడు తన రీసెర్చ్ పేపర్లను గర్వంగా చూపించాడు. యూనిక్ ఇండియన్ అంటూ ఆనంద్ మహింద్రా ఆ యువకుడిని అభినందించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు దాదాపు 5 లక్షలకు వీడియోని వీక్షించారు. 12 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..