అంబాసిడర్ కారు ధర 16 వేలు మాత్రమే! ఇంత ధర తగ్గడానికి కారణం ఏంటో తెలుసా?

|

Jan 30, 2023 | 8:14 AM

ఇప్పటికీ చాలా మంది ఈ కారును ఉపయోగిస్తున్నారు. హిందూస్థాన్ మోటార్స్ 1957లో అంబాసిడర్ కారును విడుదల చేసింది. ఇది బ్రిటిష్ కారు ఆధారంగా రూపొందించబడింది. ఈ కారు 80ల వరకు ప్రజల హృదయాలను ఏలింది. అయితే ,..

అంబాసిడర్ కారు ధర 16 వేలు మాత్రమే! ఇంత ధర తగ్గడానికి కారణం ఏంటో తెలుసా?
Ambassador Car
Follow us on

అంబాసిడర్ కారు అందరికీ గుర్తుండే ఉంటుంది.. దీనిని మన రాజకీయాలు, సినిమాల్లో ఎక్కువగా కనిపించేవి. రాజకీయ నాయకుల నుండి పరిపాలనలో ఉన్న వ్యక్తుల వరకు అప్పట్లో విస్తృతంగా ఉపయోగించారు. ఇప్పటికీ చాలా మంది ఈ కారును ఉపయోగిస్తున్నారు. హిందూస్థాన్ మోటార్స్ 1957లో అంబాసిడర్ కారును విడుదల చేసింది. ఇది బ్రిటిష్ కారు ఆధారంగా రూపొందించబడింది. ఈ కారు 80ల వరకు ప్రజల హృదయాలను ఏలింది. అయితే మారుతీ సుజుకీ వచ్చిన తర్వాత దాని ఆదరణ తగ్గింది. దీని ఉత్పత్తి 2014లో ఆగిపోయింది. కానీ ఈ కారుప్రయాణం అంటే.. ఇప్పటికీ ‘గర్వించదగ్గ రైడ్’గానే పరిగణింపబడుతుంది.

ఆనాటి అంబాసిడర్ ధర:
తాజాగా, 1972 అంబాసిడర్ కారు ధరకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యేకంగా, ఈ ఫోటోలని ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు. ఇందులో 50 ఏళ్ల క్రితం జనవరి 25, 1972 నాటి వార్తలను చూపారు. ‘కార్ల ధరలు పెరిగాయి’ అనే వార్త హెడ్డింగ్. ఈ వార్త చదివాక 1972లో అంబాసిడర్ ధర 127 రూపాయలు పెరిగి 16,946 రూపాయలకు చేరింది. ఆ తర్వాత ఈ కారు కొత్త ధర ₹ 16,946 అయింది. ఇది కాకుండా, ఫియట్ కారులో రూ.259 పెరిగిన తర్వాత, దాని ధర రూ.15,946కి పెరిగింది. ఈ వార్త చదివి ఆనంద్ మహీంద్రా కూడా ఆశ్చర్యపోయారు. ఈ ధరలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా ఆనంద్ మహీంద్రా చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఆనంద్ మహీంద్రా షాక్:
ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ, “ఇది నన్ను ‘సండే మెమోరీస్’లోకి తీసుకెళ్లిందన్నారు. అప్పుడు తాను జేజే కాలేజీలో ఉన్నానని, బస్సులో కాలేజీకి వెళ్లేవాడినని చెప్పారు. కానీ, మా అమ్మ అప్పుడప్పుడు తన నీలిరంగు ఫియట్ కారును నడపడానికి నన్ను అనుమతించేది. అయితే ఆ కారు ఇంత విలువైనదని నాకు అప్పుడు తెలియదు. అంటూ రాశారు.

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియా యూజర్ స్పందిస్తూ.. 1972లో మా నాన్న అంబాసిడర్ కారును రూ. 18000కి కొన్నారు అని రాశారు. మరొక వినియోగదారు ఇది ఖరీదైనది. అదే సమయంలో ఇతర వినియోగదారులు భారతదేశంలో రూపాయి క్షీణతపై ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..