AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైరల్ అవుదామని రైల్లో స్నానం చేశాడు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో సగం మంది రీల్స్ చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారు. రీల్స్ చేయడం ద్వారా తాము ఫేమస్ అయితే, తమ జీవితం కూడా సెట్ అవుతుందని కోరుకుంటున్నారు. అలాంటి ఆలోచన కలిగి ఉండటంలో తప్పు లేదు. ఈ క్రమంలోనే రీల్స్, సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ముఖాలు చాలానే ఉన్నాయి. కానీ రీల్స్ ద్వారా వైరల్ అవ్వడానికి జనం ఏమి చేస్తున్నారు.

వైరల్ అవుదామని రైల్లో స్నానం చేశాడు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్..!
Viral Video
Balaraju Goud
|

Updated on: Nov 10, 2025 | 4:55 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో సగం మంది రీల్స్ చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారు. రీల్స్ చేయడం ద్వారా తాము ఫేమస్ అయితే, తమ జీవితం కూడా సెట్ అవుతుందని కోరుకుంటున్నారు. అలాంటి ఆలోచన కలిగి ఉండటంలో తప్పు లేదు. ఈ క్రమంలోనే రీల్స్, సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ముఖాలు చాలానే ఉన్నాయి. కానీ రీల్స్ ద్వారా వైరల్ అవ్వడానికి జనం ఏమి చేస్తున్నారు. వారు ఎక్కడ చేస్తున్నారు అనే విషయాలను గుర్తుంచుకోవడం మానేశారు. తామున్న పరిసరాలనే మర్చిపోతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే, వింతగా అనిపించే అలాంటి చర్యను ఏ బహిరంగ ప్రదేశంలోనూ చేయకూడదు. కానీ చాలా మంది అదే చేస్తున్నారు. ప్రస్తుతం, అలాంటిదే ఒక వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో రైలు లోపల చోటు చేసుకుంది. ఆ వీడియోలో రైలులో చాలా తక్కువ మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని తెలుస్తుంది. ఒక వ్యక్తి రైలు తలుపు బయట నిలబడి ఉన్నాడు. అతని ముందు ఒక బకెట్ నీళ్ళు ఉన్నాయి. అతను ఒక గ్లాసు నుండి నీళ్ళు పోసుకుని స్నానం చేయడం ప్రారంభించాడు. తరువాత అతను కొద్దిగా షాంపూ రాసుకుని మళ్ళీ తన శరీరంపై నీళ్ళు పోసుకుని స్నానం చేశాడు. చివరికి, అతను మొత్తం బకెట్ తీసుకొని, మిగిలిన నీటిని ఒకేసారి తన శరీరంపై పోసుకున్నాడు. వైరల్ అవ్వడానికి, అతను చేసిన పని ఇప్పుడు అతన్ని ఇబ్బందుల్లో పడేసింది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండిః

మీరు ఇప్పుడు చూసిన ఈ వీడియోను X ప్లాట్‌ఫామ్‌లో @WokePandemic అనే ఖాతా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. నార్త్ సెంట్రల్ రైల్వే అదే పోస్ట్‌ను వారి ఖాతా (@CPRONCR) నుండి షేర్ చేశారు. దీంతో రైలులో స్నానం చేస్తున్న వీడియోను తీసిన వ్యక్తిని గుర్తించారు. ఈ వ్యక్తి రీల్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందేందుకు ఇలా చేసినట్లు అంగీకరించాడు. సదరు వ్యక్తిపై RPF చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులందరూ ఇతర ప్రయాణీకులకు అనుచితమైన, అసౌకర్యంగా ఉండే ఏ పని చేయవద్దని నార్త్ సెంట్రల్ రైల్వే అభ్యర్థిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..