AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు 25 గంటలు..! నాసా శాస్త్రవేత్తలు చెప్పిన రహస్యాలు తెలిస్తే అవాక్కే..

మనం రోజంతా కష్టపడినా టైమ్ సరిపోవడం లేదే అని బాధపడుతుంటాం కదా.. అయితే భవిష్యత్తులో మనకు అదనంగా మరో గంట దొరకనుంది. అవును.. మీరు విన్నది నిజమే.. ప్రకృతి కాలచక్రం మారబోతుంది. రోజుకు 24 గంటలు కాస్తా, 25 గంటలు కాబోతున్నాయని నాసా శాస్త్రవేత్తలు సంచలన విషయాన్ని వెల్లడించారు. భూమి తిరిగే వేగం ఎందుకు తగ్గుతోంది? అనే విషయాలు తెలుసుకుందాం..

రోజుకు 25 గంటలు..! నాసా శాస్త్రవేత్తలు చెప్పిన రహస్యాలు తెలిస్తే అవాక్కే..
Why A Day On Earth Will Soon Last 25 Hours
Krishna S
|

Updated on: Apr 24, 2026 | 7:27 PM

Share

ప్రకృతి నియమం ప్రకారం.. మనకు రోజుకు 24 గంటలు మాత్రమే ఉంటాయని తెలుసు. కానీ రాబోయే రోజుల్లో ఈ కాలచక్రం మారబోతోంది. భూమి తన అక్షం చుట్టూ తిరిగే వేగం క్రమంగా మందగిస్తోందని, దీనివల్ల భవిష్యత్తులో రోజు నిడివి 25 గంటలకు పెరుగుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ మార్పు ఇప్పుడే జరగదు.. దీని వెనుక కోట్లాది సంవత్సరాల పరిణామ క్రమం దాగి ఉంది.

ఎందుకు తగ్గుతోంది..?

భూమి భ్రమణ వేగం తగ్గడానికి ప్రధాన కారణం చంద్రుడు. భూమికి, చంద్రునికి మధ్య జరిగే గురుత్వాకర్షణ శక్తి మార్పిడి వల్ల ఈ మార్పు సంభవిస్తోంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఉన్న సముద్రాలలో అలలను సృష్టిస్తుంది. ఈ ప్రక్రియలో ఏర్పడే ఘర్షణ భూమి భ్రమణ శక్తిని కొద్దిగా తగ్గిస్తుంది. దీనివల్ల చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుండి కొద్దిగా దూరంగా జరుగుతున్నాడు. చంద్రుడు దూరం వెళ్ళే కొద్దీ, భూమి తిరిగే వేగం మరింత తగ్గుతూ వస్తోంది.

100 ఏళ్లలో మిల్లీసెకన్ల మార్పు

శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం.. ప్రతి 100 సంవత్సరాలకు భూమి భ్రమణ కాలంలో సుమారు 1.7 మిల్లీసెకన్లు పెరుగుతున్నాయి. ఇది చాలా చిన్న మార్పుగా అనిపించినప్పటికీ, లక్షలాది సంవత్సరాల కాలక్రమంలో ఇది భారీ వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. మరో 20 కోట్ల ఏళ్ల తర్వాత భూమిపై ఒక రోజు నిడివి 25 గంటలకు చేరుకుంటుంది.

గతంలో 18 గంటలే..

భూమి చరిత్రను పరిశీలిస్తే ఒక రోజు నిడివి ఎప్పుడూ స్థిరంగా లేదు. భూమి ఏర్పడిన తొలినాళ్లలో భ్రమణ వేగం చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు ఒక రోజు కేవలం 18 గంటలే ఉండేది. కొన్ని మిలియన్ల ఏళ్ల క్రితం డైనోసార్లు భూమిపై ఉన్నప్పుడు ఒక రోజు నిడివి 23 గంటలు ఉండేది. మనం అనుసరిస్తున్న 24 గంటల కాలచక్రం కూడా ప్రకృతిలో జరుగుతున్న ఈ నిరంతర మార్పుల ఫలితమే. భవిష్యత్తులో భూమి తన వేగాన్ని మరింత తగ్గించుకుంటూ.. కొత్త కాలచక్రాన్ని సృష్టించబోతోందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇది మానవ జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించడం అసాధ్యం కానీ ప్రకృతి సిద్ధంగా జరుగుతున్న ఈ పరిణామం మాత్రం ఆశ్చర్యకరమే.

Follow Us