AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీ వన్డే ప్రపంచకప్

ఐసీసీ వన్డే ప్రపంచకప్

ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ అనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన 50 ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్. మొదటి వన్డే ప్రపంచ కప్ టోర్నీ 1975లో ఇంగ్లాండ్‌లో ప్రారంభమైంది.

ఈ మెగా టోర్నమెంట్ చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ముఖ్యాంశాలు:

అత్యంత విజయవంతమైన జట్టు: క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యధికంగా 6 సార్లు (1987, 1999, 2003, 2007, 2015, 2023) ప్రపంచ కప్ టైటిళ్లను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది.

భారత్ రికార్డు: భారతదేశం రెండు సార్లు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. మొదటిసారి 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో, రెండోసారి 2011లో ఎం.ఎస్. ధోని కెప్టెన్సీలో భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అలాగే 2003, 2023లలో రన్నరప్‌గా నిలిచింది.

ఇతర విజేతలు: వెస్టిండీస్ (2 సార్లు – 1975, 1979), పాకిస్తాన్ (1992), శ్రీలంక (1996), ఇంగ్లాండ్ (2019) ఒక్కొక్కసారి చొప్పున ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్: 2023లో భారతదేశంలో జరిగిన చివరి వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ప్రస్తుత ఛాంపియన్‌గా కొనసాగుతోంది.

2027 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 14వ ఎడిషన్ టోర్నమెంట్‌గా నిలవనుంది. దీనికి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి టోర్నమెంట్‌ను 14 జట్ల విస్తృత ఫార్మాట్‌తో నిర్వహించనున్నారు. 2023లో ఆరోసారి టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

2027 ప్రపంచ కప్ ముఖ్య వివరాలు:

ఆతిథ్య దేశాలు: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా.

పాల్గొనే జట్లు: 14 జట్లకు పెంపు.

డిఫెండింగ్ ఛాంపియన్: ఆస్ట్రేలియా.

అర్హత (క్వాలిఫికేషన్): ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న పూర్తి స్థాయి సభ్య దేశాలతో పాటు, సహ-ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన జట్లు క్వాలిఫైయర్స్ ద్వారా పోటీ పడాల్సి ఉంటుంది.

అర్హత సంక్లిష్టత: ఐసీసీ కఠినమైన ర్యాంకింగ్ నిబంధనల కారణంగా, సహ-ఆతిథ్య దేశమైనప్పటికీ నమీబియా నేరుగా అర్హత సాధించలేదు. అది క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి

Team India: 15మందితో టీమిండియా వన్డే ప్రపంచకప్ 2027 స్వ్కాడ్.. లిస్ట్‌లో గంభీర్ ఫేవరేట్..?

Team India ODI World Cup 2027: గౌతమ్ గంభీర్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్‌మెంట్ యువతరం ఉత్సాహాన్ని, సీనియర్ల అనుభవాన్ని సమతూకం చేస్తూ ప్రపంచకప్ వేటను ప్రారంభించింది. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ద్వారా లభించే ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఈ 15 మంది ఆటగాళ్లే మరిన్ని మెరుగులు దిద్దుకుని 2027 లో భారత్‌కు ప్రపంచకప్ అందించడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు.

టీమిండియా నుంచి ఆ ముగ్గురు బ్యాగులు సర్దుకోవాల్సిందే.. వన్డే వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఔట్..?

ODI World Cup 2027: కాలం మారుతున్న కొద్దీ పాత తరం తప్పుకుని కొత్త తరం రావడం సహజం. భారత క్రికెట్ భవిష్యత్తు కోసం సెలెక్టర్లు తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు అభిమానులకు కొంత నిరాశ కలిగించినా, రాబోయే ప్రపంచకప్‌లో సరికొత్త టీమ్ ఇండియాని చూసేందుకు ఇవి అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అఫ్గాన్ సిరీస్‌లో అదరగొట్టినా.. 2027 వరల్డ్ కప్ నుంచి ఈ ముగ్గురు తోపులు ఔట్.. ఎందుకంటే?

ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ విజయం, వన్డే సిరీస్‌లో ఇప్పటికే ఆధిక్యం సాధించిన భారత్.. ఎందరో కొత్త ప్రతిభావంతులను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ఈ సిరీస్‌లో అదరగొట్టిన ముగ్గురు యువ ఆటగాళ్లకు మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కడం అంత సులువు కాదనిపిస్తోంది.

2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్.. రంగంలోకి ముగ్గుర్ని దింపిన గంభీర్..?

ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి గాయాల పాలు కావడం టీమిండియాను తీవ్ర ఆందోళనలో పడేసింది. ఈ నేపథ్యంలో, 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. హార్దిక్, నితీష్‌లకు బ్యాకప్‌గా జట్టులోకి రాగల ఆ ముగ్గురు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. ఆ స్పెషల్ క్లబ్‌లోకి రోహిత్ శర్మ..!

India vs Afghanistan 2nd ODI: రోహిత్ శర్మ సాధించిన ఈ ఘనత అతని నిలకడకు, క్లాస్‌కు నిదర్శనం. ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ ఓపెనర్‌గా తన స్థానాన్ని అతను మరోసారి సుస్థిరం చేసుకున్నాడు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా, వ్యక్తిగత రికార్డులతో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న హిట్‌మ్యాన్ ఫామ్ టీమిండియాకు రాబోయే టోర్నమెంట్లలో కొండంత బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

IND vs AFG 2nd ODI: టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ఎవరొచ్చారంటే?

India vs Afghanistan 2nd ODI: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు పరిమితమైన ఈ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులు చేసింది. టీమిండియా ఈ లక్ష్యాన్ని 22.5 ఓవర్లలో ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

రాసిపెట్టుకో గంభీర్.. వాడ్ని నమ్మి వరల్డ్ కప్‌ బరిలోకి దిగితే.. నిండా మునగడం గ్యారెంటీ

Suresh Raina Warns Team India: భారత జట్టు 2027లో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలంటే హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై మాత్రమే ఆధారపడటం సరికాదనేది స్పష్టమవుతోంది. సురేష్ రైనా సూచించినట్లుగా, నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆల్రౌండర్లను సానబెట్టి, జట్టుకు బలమైన బ్యాకప్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవడంపై బీసీసీఐ తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

IND vs AFG: అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. 2027 వన్డే ప్రపంచకప్‌‌కి నాట్ ఓకే.. ఈ ముగ్గురి దరిద్రం ఏంటో తెలుసా?

India vs Afghanistan ODI Series: అఫ్గానిస్తాన్‌తో జరిగే సిరీస్ ఈ ముగ్గురు యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం. ఇక్కడ వారు అద్భుతంగా రాణించినప్పటికీ, సీనియర్ ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తే మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవడం వీరికి అంత సులువు కాదు.

2027 ప్రపంచకప్ గెలవాలంటే.. 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్.. లేదంటే మరోసారి..?

ODI World Cup 2027 Team India Squad: గత 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తర్వాత భారత క్రికెట్ జట్టును ఒక సమస్య నిరంతరం వేధిస్తోంది. అదే మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వం లేకపోవడం. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ లైనప్‌లో అత్యంత కీలకమైన ఐదో స్థానంలో నికార్సైన ఆటగాడి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ నలుగురిపై పగబట్టిన గంభీర్.. ప్రపంచకప్ 2027కి ముందే జట్టు నుంచి గెంటేసేందుకు స్కెచ్..?

ICC ODI World Cup 2026 2027: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సుదీర్ఘమైన ప్రయాణం ముగియబోతోందా? కోట్లాది మంది అభిమానులను తమ ఆటతో అలరించిన భారత క్రికెట్ దిగ్గజాలు మైదానాన్ని వీడనున్నారా? అంటే అవుననే అంటున్నాయి విశ్లేషణలు. వచ్చే ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ సమరమే భారత జట్టుకు చెందిన నలుగురు అగ్రశ్రేణి ఆటగాళ్లకు ఆఖరి టోర్నీ కానుంది.

Women’s T20 World Cup 2026 : ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫైట్.. మహిళల టీ20 వరల్డ్ కప్ కంప్లీట్ షెడ్యూల్ ఇదే

Women's T20 World Cup 2026 : లీగ్ దశలో భాగంగా అన్ని జట్లు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ అత్యంత బలమైన స్క్వాడ్స్‌ను అధికారికంగా ప్రకటించాయి. టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల పూర్తి వివరాలు చూద్దాం.

  • Rakesh
  • Updated on: Jun 11, 2026
  • 4:49 pm

‘ఎవరున్నా లేకపోయినా.. 2027 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు ఉంటే చాలు.. ట్రోఫీ టీమిండియాదే..’

ODI World Cup 2027: ఇటీవల అఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రోహిత్, కోహ్లీల పేర్లు ఉండటం అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా వీరు సాగిస్తున్న ఈ ప్రయాణం విజయవంతమై, భారత్‌కు మరో ప్రపంచ కప్ అందించాలని కోరుకుందాం.