ఐసీసీ వన్డే ప్రపంచకప్
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ అనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన 50 ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్. మొదటి వన్డే ప్రపంచ కప్ టోర్నీ 1975లో ఇంగ్లాండ్లో ప్రారంభమైంది.
ఈ మెగా టోర్నమెంట్ చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ముఖ్యాంశాలు:
అత్యంత విజయవంతమైన జట్టు: క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యధికంగా 6 సార్లు (1987, 1999, 2003, 2007, 2015, 2023) ప్రపంచ కప్ టైటిళ్లను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది.
భారత్ రికార్డు: భారతదేశం రెండు సార్లు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. మొదటిసారి 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో, రెండోసారి 2011లో ఎం.ఎస్. ధోని కెప్టెన్సీలో భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అలాగే 2003, 2023లలో రన్నరప్గా నిలిచింది.
ఇతర విజేతలు: వెస్టిండీస్ (2 సార్లు – 1975, 1979), పాకిస్తాన్ (1992), శ్రీలంక (1996), ఇంగ్లాండ్ (2019) ఒక్కొక్కసారి చొప్పున ప్రపంచ కప్ను గెలుచుకున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్: 2023లో భారతదేశంలో జరిగిన చివరి వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ను ఓడించి ఆస్ట్రేలియా ప్రస్తుత ఛాంపియన్గా కొనసాగుతోంది.
2027 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 14వ ఎడిషన్ టోర్నమెంట్గా నిలవనుంది. దీనికి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి టోర్నమెంట్ను 14 జట్ల విస్తృత ఫార్మాట్తో నిర్వహించనున్నారు. 2023లో ఆరోసారి టైటిల్ను గెలుచుకున్న ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది.
2027 ప్రపంచ కప్ ముఖ్య వివరాలు:
ఆతిథ్య దేశాలు: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా.
పాల్గొనే జట్లు: 14 జట్లకు పెంపు.
డిఫెండింగ్ ఛాంపియన్: ఆస్ట్రేలియా.
అర్హత (క్వాలిఫికేషన్): ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న పూర్తి స్థాయి సభ్య దేశాలతో పాటు, సహ-ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన జట్లు క్వాలిఫైయర్స్ ద్వారా పోటీ పడాల్సి ఉంటుంది.
అర్హత సంక్లిష్టత: ఐసీసీ కఠినమైన ర్యాంకింగ్ నిబంధనల కారణంగా, సహ-ఆతిథ్య దేశమైనప్పటికీ నమీబియా నేరుగా అర్హత సాధించలేదు. అది క్వాలిఫైయింగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.
రోహిత్ శర్మ లేకుండానే స్వ్కాడ్.. 2027 వన్డే ప్రపంచకప్లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..?
India World Cup 2027 squad: కేవలం తన ఆటతీరుతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్న రోహిత్ శర్మ లేని భారత జట్టును ఊహించుకోవడం ప్రతి క్రికెట్ అభిమానికి గుండెకోతే. అయినప్పటికీ భవిష్యత్తు కోసం కాలంతో పాటు వచ్చే మార్పులను స్వీకరించక తప్పదు.
- Venkata Chari
- Updated on: Jul 19, 2026
- 6:57 pm
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్ల్లో భారత్, పాక్ ఢీ.. ప్రపంచకప్ ఫార్మాట్ మార్చేసిన ఐసీసీ?
ICC New Format ODI World Cup 2027: రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోయిన తరుణంలో, ఐసీసీ టోర్నీలే అభిమానులకు ఏకైక దిక్కుగా మారాయి. ఐసీసీ తీసుకొచ్చిన ఈ కొత్త 'సూపర్ 7' వినూత్న ఫార్మాట్ 2027 ప్రపంచకప్లో సరికొత్త ఉత్కంఠను రేకెత్తించడమే కాకుండా, క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్షిప్ సాధించేలా దోహదపడనుంది.
- Venkata Chari
- Updated on: Jul 16, 2026
- 10:06 am
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రపంచకప్లలో మరిన్ని భారత్ – పాక్ మ్యాచ్లు.. స్కెచ్ మాములుగా లేదుగా..!
India vs Pakistan World Cup Matches: క్రికెట్ అభిమానుల నాడిని పట్టుకోవడంలో జై షా నేతృత్వంలోని ఐసీసీ మరోసారి విజయం సాధించింది. సాంప్రదాయ ఫార్మాట్లను మారుస్తూ, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాక్ పోరాటాలను మరిన్ని చూసేలా చేస్తున్న ఈ సరికొత్త నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో సరికొత్త జోష్ నింపడం ఖాయం. రాబోయే రోజుల్లో ఈ చారిత్రాత్మక మార్పులపై ఐసీసీ అధికారిక ప్రకటన వెలువడనుంది.
- Venkata Chari
- Updated on: Jul 15, 2026
- 11:34 am
ఇంగ్లాండ్లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్కు 2027 వరల్డ్ కప్లో నో ప్లేస్.. ఎందుకంటే..?
India vs England ODI series 2026: శివమ్ దూబేకు ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఒక రకంగా అగ్నిపరీక్ష లాంటిదే. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో, దూబే కేవలం అసాధారణ ఆటతీరును ప్రదర్శిస్తేనే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించగలడు. ఒకవేళ ఈ సిరీస్లో విఫలమైతే మాత్రం 2027 ప్రపంచకప్ కల కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
- Venkata Chari
- Updated on: Jul 14, 2026
- 1:00 pm
రోహిత్ ఔట్.. సందిగ్ధంలో కోహ్లీ ప్లేస్.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్పై బాంబ్ పేల్చిన గంభీర్..?
India vs England ODI 2026: భారత క్రికెట్కు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించిన రోహిత్, విరాట్ లాంటి దిగ్గజాలకు గౌతమ్ గంభీర్ హయాంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం మంచిదే అయినప్పటికీ, అనుభవజ్ఞులైన సీనియర్లను పక్కన పెట్టడం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇంగ్లాండ్ సిరీస్లో సీనియర్ల ప్రదర్శనే వారి భవిష్యత్తును శాసించనుంది.
- Venkata Chari
- Updated on: Jul 14, 2026
- 11:30 am
Team India: 15మందితో టీమిండియా వన్డే ప్రపంచకప్ 2027 స్వ్కాడ్.. లిస్ట్లో గంభీర్ ఫేవరేట్..?
Team India ODI World Cup 2027: గౌతమ్ గంభీర్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్మెంట్ యువతరం ఉత్సాహాన్ని, సీనియర్ల అనుభవాన్ని సమతూకం చేస్తూ ప్రపంచకప్ వేటను ప్రారంభించింది. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ద్వారా లభించే ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఈ 15 మంది ఆటగాళ్లే మరిన్ని మెరుగులు దిద్దుకుని 2027 లో భారత్కు ప్రపంచకప్ అందించడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు.
- Venkata Chari
- Updated on: Jun 25, 2026
- 5:48 pm
టీమిండియా నుంచి ఆ ముగ్గురు బ్యాగులు సర్దుకోవాల్సిందే.. వన్డే వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఔట్..?
ODI World Cup 2027: కాలం మారుతున్న కొద్దీ పాత తరం తప్పుకుని కొత్త తరం రావడం సహజం. భారత క్రికెట్ భవిష్యత్తు కోసం సెలెక్టర్లు తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు అభిమానులకు కొంత నిరాశ కలిగించినా, రాబోయే ప్రపంచకప్లో సరికొత్త టీమ్ ఇండియాని చూసేందుకు ఇవి అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Venkata Chari
- Updated on: Jun 23, 2026
- 6:50 am
అఫ్గాన్ సిరీస్లో అదరగొట్టినా.. 2027 వరల్డ్ కప్ నుంచి ఈ ముగ్గురు తోపులు ఔట్.. ఎందుకంటే?
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్లో టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. టెస్టు మ్యాచ్లో ఇన్నింగ్స్ విజయం, వన్డే సిరీస్లో ఇప్పటికే ఆధిక్యం సాధించిన భారత్.. ఎందరో కొత్త ప్రతిభావంతులను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ఈ సిరీస్లో అదరగొట్టిన ముగ్గురు యువ ఆటగాళ్లకు మాత్రం 2027 వన్డే ప్రపంచకప్లో చోటు దక్కడం అంత సులువు కాదనిపిస్తోంది.
- Venkata Chari
- Updated on: Jun 21, 2026
- 7:25 am
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్తోపాటు తెలుగోడు ఔట్.. రంగంలోకి ముగ్గుర్ని దింపిన గంభీర్..?
ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతోన్న వన్డే సిరీస్లో స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి గాయాల పాలు కావడం టీమిండియాను తీవ్ర ఆందోళనలో పడేసింది. ఈ నేపథ్యంలో, 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. హార్దిక్, నితీష్లకు బ్యాకప్గా జట్టులోకి రాగల ఆ ముగ్గురు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
- Venkata Chari
- Updated on: Jun 17, 2026
- 6:51 pm
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్మ్యాన్.. ఆ స్పెషల్ క్లబ్లోకి రోహిత్ శర్మ..!
India vs Afghanistan 2nd ODI: రోహిత్ శర్మ సాధించిన ఈ ఘనత అతని నిలకడకు, క్లాస్కు నిదర్శనం. ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ ఓపెనర్గా తన స్థానాన్ని అతను మరోసారి సుస్థిరం చేసుకున్నాడు. కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా, వ్యక్తిగత రికార్డులతో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న హిట్మ్యాన్ ఫామ్ టీమిండియాకు రాబోయే టోర్నమెంట్లలో కొండంత బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
- Venkata Chari
- Updated on: Jun 17, 2026
- 2:49 pm
IND vs AFG 2nd ODI: టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ఎవరొచ్చారంటే?
India vs Afghanistan 2nd ODI: ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లోని మొదటి మ్యాచ్లో టీమిండియా భారీ విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు పరిమితమైన ఈ మ్యాచ్లో, మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులు చేసింది. టీమిండియా ఈ లక్ష్యాన్ని 22.5 ఓవర్లలో ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
- Venkata Chari
- Updated on: Jun 16, 2026
- 3:58 pm
రాసిపెట్టుకో గంభీర్.. వాడ్ని నమ్మి వరల్డ్ కప్ బరిలోకి దిగితే.. నిండా మునగడం గ్యారెంటీ
Suresh Raina Warns Team India: భారత జట్టు 2027లో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలంటే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్పై మాత్రమే ఆధారపడటం సరికాదనేది స్పష్టమవుతోంది. సురేష్ రైనా సూచించినట్లుగా, నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆల్రౌండర్లను సానబెట్టి, జట్టుకు బలమైన బ్యాకప్ ప్లాన్ను సిద్ధం చేసుకోవడంపై బీసీసీఐ తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- Venkata Chari
- Updated on: Jun 14, 2026
- 4:55 pm