Road Accident: న్యూ ఇయర్ వేడుకల్లో పెను విషాదం.. ఇద్దరు యువకులు స్పాట్‌ డెడ్‌! ఎక్కడంటే..

| Edited By: Srilakshmi C

Jan 02, 2024 | 8:16 AM

న్యూ ఇయర్ వేడుకలు ఆ యువకుల ఇళ్లలో జీవితమంతా తీరని విషాదాన్ని మిగిల్చాయి. సరదాగా విహారయాత్రకు వెళ్ళిన స్నేహతులు రోడ్డు ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదం మహబూబాబాద్ శివారు లోని ఎటిగడ్డతండా వద్ద జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి..

వరంగల్‌, జనవరి 2: న్యూ ఇయర్ వేడుకలు ఆ యువకుల ఇళ్లలో జీవితమంతా తీరని విషాదాన్ని మిగిల్చాయి. సరదాగా విహారయాత్రకు వెళ్ళిన స్నేహతులు రోడ్డు ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదం మహబూబాబాద్ శివారు లోని ఎటిగడ్డతండా వద్ద జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతానికి చెందిన సాయితేజ, లక్ష్మణ్, సాయిరాం, రవితేజ, సాయి.. ఈ ఐదుగురు కలిసి కారులో వరంగల్ నుంచి విహారయాత్రకు ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు మహబూబాబాద్ శివారులోని ఏటి గడ్డతండా సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొని బోల్తా కొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయలపాలైన ముగ్గురిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.