Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: కూలీలపై బోల్తా పడిన టిప్పర్ లారీ.. క్వారీలో ముగ్గురు దుర్మరణం..

Hanumakonda Query Accident: తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీలో ప్రమాదవశాత్తూ టిప్పర్ లారీ

Crime News: కూలీలపై బోల్తా పడిన టిప్పర్ లారీ.. క్వారీలో ముగ్గురు దుర్మరణం..
Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 18, 2021 | 5:58 PM

Hanumakonda Query Accident: తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీలో ప్రమాదవశాత్తూ టిప్పర్ లారీ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన కాజీపేట మండలం తరాలపల్లి శివారులోని గాయత్రి క్వారీలో జరిగింది. క్వారీలో వెళుతున్న టిప్పర్ ప్రమాదవశాత్తూ పని చేస్తున్న వారిపై శనివారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చందు, గూడురు మండలం బొద్దుగొండకు చెందిన ముఖేష్, జార్ఖండ్‌కు చెందిన అఖీమ్ మృతి చెందారు.

క్వరీలో వేగంగా వచ్చిన టిప్పర్.. అదుపుతప్పి పనిచేస్తున్న ముగ్గురిపై పడటంతో ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని వెల్లడించారు. మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మడికొండ పోలీసులు తెలిపారు. Also Read:

Karachi Blast: కరాచీలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం.. పలువురికి తీవ్రగాయాలు..

Kamareddy Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు దుర్మరణం..