CM KCR: బీఆర్‌ఎస్‌ తొలి టార్గెట్‌ కర్నాటక ఎన్నికలు.. గుల్బర్గా నుంచి బీదర్‌ వరకు ఏడు జిల్లాల్లో పోటీ

గులాబీ జెండా మధ్యలో భారతదేశం ఉండేలా కొత్త జెండాను రూపొందించారు. ఐతే పార్టీ పేరు మారినా కారు గుర్తు కొనసాగనుంది. ఇక బీఆర్‌ఎస్‌ ఆవిర్భావంతో తెలంగాణ భవన్ ఎదుట కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

CM KCR:  బీఆర్‌ఎస్‌ తొలి టార్గెట్‌ కర్నాటక ఎన్నికలు.. గుల్బర్గా నుంచి బీదర్‌ వరకు ఏడు జిల్లాల్లో పోటీ
BRS Party CM KCR
Follow us

|

Updated on: Dec 09, 2022 | 2:52 PM

తెలంగాణ రాష్ట్ర సమితి BRSగా మారిపోయింది. పార్టీ చరిత్రలో నవశకం మొదలైంది. 21 ఏళ్ల ఉద్యమపార్టీ ప్రస్థానంలో ఇది సరికొత్త చరిత్ర. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 13 ఏళ్ల తర్వాత ఆ గమ్యాన్ని ముద్దాడింది. వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన TRS.. 8 ఏళ్ల తర్వాత భారత్‌ రాష్ట్ర సమితిగా మారిపోయింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సమాయత్తమైంది.. ముందుగానే నిర్ణయించిన దివ్యముహూర్తం ప్రకారం..సరిగ్గా 1:20 నిమిషాలకు ఈసీ పంపిన BRS పత్రాలపై సంతకం చేశారు CM కేసీఆర్..! అనంతరం BRS జెండాను ఆవిష్కరించారు..!

శంషాబాద్‌ మెట్రోకు శంకుస్థాన చేసిన తర్వాత.. అక్కడి నుంచి నేరుగా తెలంగాణభవన్‌కు చేరుకున్నారు CM కేసీఆర్.. పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు…! తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా..! రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ ప్రక్రియకు సంబంధించిన ఫార్మాలిటీస్‌ కూడా పూర్తయ్యాయి. త్వరలోనే నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయనుంది ఈసీ.. అక్టోబర్‌ 5న TRSను BRSగా గుర్తించాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు కేసీఆర్. ఈసీ సూచన మేరకు పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో చెప్పాలంటూ పబ్లిక్‌ నోటీస్‌ కూడా ఇచ్చారు. గడువు ముగిసినా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్‌ రాష్ట్ర సమితిగా గుర్తిస్తున్నట్లు అధికారికంగా లేఖ రాసింది ఎన్నికల సంఘం..! ఇప్పుడు ఈ లేఖపైనే సంతకం చేసి మళ్లీ ఈసీకి పంపారు కేసీఆర్.

BRS నూతన జెండాను ఆవిష్కరించారు కేసీఆర్. గులాబీ జెండా మధ్యలో భారతదేశం మ్యాప్‌ ఉంది. పార్టీ పేరు, జెండా మారినప్పటికీ కారు గుర్తుమాత్రం కొనసాగనుంది. ఈ ఏడాది అక్టోబ‌ర్ 5న‌.. ద‌స‌రా రోజున జాతీయ పార్టీపై ప్రకటన చేశారు కేసీఆర్. TRSను BRSగా మారుస్తూ.. పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కేసీఆర్‌తో పాటు 283 మంది ప్రతినిధులు ఆ తీర్మానంపై సంత‌కం చేశారు. 21ఏళ్ల ప్రస్థానంలో ఇదో కీలక మలుపు. ఇప్పుడు EC గుర్తింపుతో TRS.. BRSగా మారిపోయింది.

కర్నాటక ఎన్నికల్లో పోటీ..

జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు..! BJPని నేరుగా ఢీ కొట్టేందుకు సై అంటున్నారు..! దేశం మారాలి. అది తెలంగాణ నుంచే మొదలవ్వాలని దాదాపు ప్రతి మీటింగ్‌లోనూ చెబుతున్నారు..! ఇప్పటికే పలు పార్టీల జాతీయ నేతలతోనూ ఆయన సమావేశం అయ్యారు. 2023లో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇకపై కేసీఆర్ అడుగులు ఉంటాయని చెబుతున్నాయి పార్టీ శ్రేణులు. బీఆర్‌ఎస్‌ తొలి టార్గెట్‌ కర్నాటక ఎన్నికలు. 2023 మేలోపు ఈ ఎన్నికలు జరుగుతాయి. BRS తొలి ప్రస్థానం కన్నడ గడ్డపై నుంచే మొదలవుతుంది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో JDS తో కలిసి పోటీ చేయనుంది BRS. గుల్బర్గా నుంచి బీదర్‌ వరకు ఏడు జిల్లాల్లో పోటీ చేయనుంది BRS.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు