ఇలా తయారయ్యారేంట్రా సామీ… ఇలాంటి దొంగను ఎక్కడా చూసి ఉండరు..!

హైదరాబాద్‌ పాతబస్తీలో గత కొంతకాలంగా ఒక విచిత్రమైన దొంగతనం చోటుచేసుకుంటోంది. రాత్రిపూట హోటళ్ల ముందు చెప్పులు ఉంచి లోపలికి వెళ్లే కస్టమర్లు, తిరిగి బయటకు వచ్చేసరికి చెప్పులు కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొదట్లో ఇది ఒకటి రెండు ఘటనలుగా భావించినా, తరువాత ప్రతి రోజు ఒక హోటల్‌లో అయినా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో వ్యాపారులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఇలా తయారయ్యారేంట్రా సామీ... ఇలాంటి దొంగను ఎక్కడా చూసి ఉండరు..!
Thief Stealing Slippers

Edited By: Balaraju Goud

Updated on: Nov 01, 2025 | 11:38 PM

హైదరాబాద్‌ పాతబస్తీలో గత కొంతకాలంగా ఒక విచిత్రమైన దొంగతనం చోటుచేసుకుంటోంది. రాత్రిపూట హోటళ్ల ముందు చెప్పులు ఉంచి లోపలికి వెళ్లే కస్టమర్లు, తిరిగి బయటకు వచ్చేసరికి చెప్పులు కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొదట్లో ఇది ఒకటి రెండు ఘటనలుగా భావించినా, తరువాత ప్రతి రోజు ఒక హోటల్‌లో అయినా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో వ్యాపారులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఎర్రకుంట ప్రాంతంలో రాత్రి వేళల్లో హోటల్‌లకు వచ్చే కస్టమర్లను గమనిస్తే భోజనం చేసేందుకు వచ్చినట్టు కనిపించే ఒక వ్యక్తి ముందుగా హోటల్‌ బయట చెప్పుల సంఖ్య, వాటి రకం, కొత్తగా ఉన్నాయా పాతవా అన్నది గమనించేవాడు. కొంత సేపటికి మళ్లీ అదే ప్రదేశానికి వచ్చి తినడానికి వచ్చినట్టు నటించి లేదా పార్సల్ తీసుకెళ్లే వ్యక్తిలా హోటల్‌లోకి ప్రవేశించి ఎవరి దృష్టికి చిక్కకుండా బయట చెప్పులు వేసుకుని నిశ్శబ్దంగా వెళ్లిపోతున్నాడు.

ఈ ఘటనలు ఒకటి రెండు హోటళ్లకు పరిమితం కాకుండా ఎర్రకుంట ప్రాంతంలోని దాదాపు అన్ని రాత్రి హోటళ్లలో జరుగుతుండటంతో యాజమాన్యాలు కంగారుపడ్డాయి. కస్టమర్లు భోజనం చేసి బయటకు వచ్చేసరికి చెప్పులు మాయమవుతుండటంతో హోటల్ యాజమాన్యాలు ఇబ్బంది పడటం ప్రారంభించారు. కస్టమర్ల అసంతృప్తి పెరగడంతో హోటళ్లకు వచ్చే రద్దీ కూడా తగ్గిపోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొంతమంది హోటల్ యజమానులు స్వయంగా సీసీటీవీలు అమర్చారు. అనుమానితులను గమనిస్తూ కొన్ని రోజులు నిఘా పెట్టిన తరువాత చివరకు ఆ చెప్పుల దొంగను పట్టుకున్నారు.

పట్టుబడ్డ వ్యక్తి చేతిలో అనేక జతల చెప్పులు దొరికాయి. విచారణలో తెలిసింది ఏమిటంటే అతను రాత్రిపూట హోటళ్ల దగ్గర తిరుగుతూ ఉన్నతమైన చెప్పులు, సాండల్స్ చూసి వాటిని దొంగిలించేవాడట. కొన్ని చెప్పులు తనకు సరిపోకపోతే వాటిని తిరిగి అమ్ముకునేవాడని సమాచారం. ఆ దొంగతనాలు పాతబస్తీ ప్రాంతంలో మాత్రమే కాకుండా సమీపంలోని మరికొన్ని కాలనీలలో కూడా చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇలాంటి చిన్నపాటి దొంగతనాలు ప్రజలకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. పోలీసు అధికారులు తరచూ నిఘా పెడితే లేదా హోటల్‌ యాజమాన్యాలతో సమన్వయం చేస్తే ఇలాంటి ఘటనలు జరగవని వారు సూచిస్తున్నారు.

పాతబస్తీ ప్రాంతం రాత్రిపూట చురుగ్గా ఉండే ప్రదేశం కావడంతో హోటళ్లకు వచ్చే కస్టమర్లు భద్రతపై నమ్మకంతో రావాల్సిన అవసరం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదంతా చూస్తే ఎర్రకుంటలో చిన్నపాటి దొంగతనమే అయినా ప్రజలలో భద్రతా ఆందోళనను కలిగించింది. చివరికి సీసీటీవీ సహాయంతో దొంగ పట్టుబడినప్పటికీ, పోలీసులు మరింత పర్యవేక్షణను పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..