కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి.. కట్ చేస్తే సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ప్రణీత 

09 July  2026

Pic credit - Instagram

Rajeev 

కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో  నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్. ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉండేది.

2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా కన్నడ రీమేక్ పోర్కి సి నిమాతో కన్నడలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రణీత సుభాష్.

ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. సిద్దార్థ్ సరసన తెలుగులో తను నటించిన బావ తనకు మంచి పేరును తీసుకొచ్చింది.

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆమె ప్రధాన పాత్రల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా చేసింది.

అత్తారింటికి దారేది సినిమా తో మరోసారి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తను నటించిన పాండవులు పాండవులు తుమ్మెద హిట్ అయ్యింది.

కెరీర్ పీక్ లో ఉండగానే ఈ చిన్నది పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించలేదు ప్రణీత సుభాష్.

ప్రణీత వివాహం బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో 2021 మే 30న జరిగింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో లైఫ్ లీడ్ చేస్తుంది ఈ అమ్మడు.