రెండే రెండు సినిమాలు.. దెబ్బకు సైలెంట్ అయినా ముద్దుగుమ్మ 

09 July  2026

Pic credit - Instagram

Rajeev 

మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. హీరోయిన్ గా ఈ చిన్నది మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకుంది ఈ వయ్యారి భామ. 

2018లో విడుదలైన సెన్సేషనల్ మూవీ కె.జి.యఫ్ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

ఈ అందాల భామ చేసింది 5 సినిమాలే కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కె.జి.యఫ్, కె.జి.యఫ్ 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

ఆతర్వాత తమిళ్ లో కోబ్రా అనే సినిమా చేసింది. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాతో హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆతర్వాత తెలుసు కదా అనే సినిమా చేసింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శ్రీనిధి శెట్టి సైలెంట్ అయ్యిపోయింది.