ప్రియురాలి మృతదేహాన్ని అడవిలో పడేసి వెళ్లిపోయిన ప్రియుడు.. ఎక్కడ జరిగిందంటే

కొమరం భీం జిల్లా కెరమెరి మండలంలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రియుడు అనుమానస్పద మృతదైహాన్ని అడవిలో వదిలేసి వెళ్లడం కలకలం రేపుతోంది.

ప్రియురాలి మృతదేహాన్ని అడవిలో పడేసి వెళ్లిపోయిన ప్రియుడు.. ఎక్కడ జరిగిందంటే
Death
Follow us

|

Updated on: Mar 21, 2023 | 9:08 AM

కొమరం భీం జిల్లా కెరమెరి మండలంలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రియుడు అనుమానస్పద మృతదైహాన్ని అడవిలో వదిలేసి వెళ్లడం కలకలం రేపుతోంది.వివరాల్లోకి వెళ్తే.. కెరిమెరి మండలం అగర్వాడకు చెందిన జూగ్నక్ రేణుక (26) అనే మహిళ నిర్మల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే ఈమెకు ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం లక్ష్మిదేవిపేట్ చెందిన రమేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది.దీంతో వారు సుమారు నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే రేణుక అనుమానస్పదంగా చనిపోయింది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రేణుక కుటుంబ సభ్యులకు రమేష్ ఫోన్ చేశాడు.

కానీ కెరమెరి మండలం శివారులోని వంతెన వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఓ చెట్టు కింద రేణుక శవమై కనిపించింది. దీంతో అక్కడికి వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. మృతురాలు రేణుక బాలింతగా ఉన్నట్లు గుర్తించారు. ఓ బిడ్డకు జన్మనిచ్చి అధిక రక్తస్రావంతో ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా రేణుకను రమేష్ అడవిలో పడేసి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. ఫిర్యాదు మేరకు రమేష్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..