Telangana: ‘మేం తల్చుకుంటే గోదావరి నది కూడా దాటరు’.. YS షర్మిలకు బాల్క సుమన్ స్ట్రాంగ్ వార్నింగ్

| Edited By: Ravi Kiran

Nov 30, 2022 | 10:39 PM

తెలంగాణలో షర్మిల అరెస్ట్ ఇష్యూ కాక రేపుతోంది. ఒక్కసారిగా ఆమెపై అటెన్షన్ పెరిగింది. టీఆర్‌ఎస్ నేతలు ముప్పేట మాటల దాడి చేస్తున్నారు. సీఎంను తిట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Telangana: మేం తల్చుకుంటే గోదావరి నది కూడా దాటరు.. YS షర్మిలకు బాల్క సుమన్ స్ట్రాంగ్ వార్నింగ్
Balka Suman - Ys Sharmila
Follow us on

మేం తల్చుకుంటే గోదావరి నది కూడా దాటరు.! YS షర్మిలకు TRS MLA సుమన్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కార్యకర్తలను ఆపడం తమ వల్ల కూడా కాదని అన్నారు. షర్మిల మాదిరిగానే తాము కూడా ఏపీకి వెళ్లి జగన్‌ను, అక్కడి ఎమ్మెల్యేలను తిడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు సుమన్‌. గవర్నర్‌తమిళిసైకి కూడా ప్రశ్నలు సంధించారు. పరాయివాళ్లు.. కిరాయి మనుషులతో వచ్చి తెలంగాణ గడ్డపై తోలుబొమ్మలాట ఆడుతున్నారని విమర్శించారు సుమన్. దీని వెనుక ఎవరున్నారో ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. షర్మిలా ఇలాగే మాట్లాడితే జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని హెచ్చరించారు సుమన్.

మరోవైపు ట్విట్టర్ వార్

ట్విట్టర్ వేదికగా షర్మిల వర్సెస్ టీఆర్ఎస్ కాక రేగుతోంది. మధ్య బీజేపీ ట్వీట్లు, స్పందనలు కూడా చర్చకు వస్తున్నాయి. తాము వదిలిన బాణం తాన అంటే తామరపువ్వులు తందాన అంటున్నాయని ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. షర్మిళ అరెస్టు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు.. గవర్నర్ తమిళిసై కూడా రియాక్టయ్యారు. వైయస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అరెస్టుపై ఆమె ట్వీట్ చేశారు. షర్మిల కారులో ఉన్నపుడు లాగుతున్న దృశ్యాలు తనను కలవర పెట్టారని తమిళిసై చేసిన ట్వీట్ హీట్ పెంచుతోంది.

తన అరెస్టుపై స్పందించినందుకుగానూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కొండా సురేఖ వంటి వారిని ట్యాగ్ చేస్తూ.. షర్మిల్ ట్వీట్ చేయడంపై కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించడం సోషల్ మీడియా వేదికగా.. వాడీ వేడి చర్చ సాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం