Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాంట్రాక్టు ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. 5,544 మందిని రెగ్యులరైజ్‌ చేస్తూ ఉత్తర్వులు

వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తం 40 విభాగాల్లో 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ఆదివారం..

Telangana: కాంట్రాక్టు ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. 5,544 మందిని రెగ్యులరైజ్‌ చేస్తూ ఉత్తర్వులు
Telangana CM KCR
Follow us
Srilakshmi C

|

Updated on: May 01, 2023 | 11:51 AM

వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తం 40 విభాగాల్లో 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ఆదివారం (ఏప్రిల్ 30) ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పని చేస్తున్న జూనియర్, సీనియర్ ఇన్​స్ట్రక్టర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్​ టెక్నీషియన్లు, లేబర్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ట్రైనింగ్‌ ఆఫీసర్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.

కాగా 11,103 పోస్టుల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్​చేస్తామని 2022 మార్చిలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే వీరిలో సగం మందిని ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసింది. మిగిలిర మరో సగం మందికి సంబంధించిన జీవోలను మాత్రం పెండింగ్‌లో ఉంచింది. ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అంతర్గత కారణాల రిత్య అమలుకు నోచుకోలేదు. తాజాగా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ కావడంతో కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.