AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: సిరిసిల్ల నేత బ్రతుకుల్లో సిరిసిరి మువ్వలు.. నిన్నమొన్నటి వరకు బతుకమ్మ చీరల తయారీ.. ఇప్పుడు..

అవును.. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల నేత కార్మికులకు ఇప్పుడు చేతినిండా పని దొరుకుతుంది. నిన్నమొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల తయారీతో బిజీగా

KTR: సిరిసిల్ల నేత బ్రతుకుల్లో సిరిసిరి మువ్వలు.. నిన్నమొన్నటి వరకు బతుకమ్మ చీరల తయారీ.. ఇప్పుడు..
Venkata Narayana
|

Updated on: Oct 24, 2021 | 10:34 AM

Share

Sircilla: అవును.. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల నేత కార్మికులకు ఇప్పుడు చేతినిండా పని దొరుకుతుంది. నిన్నమొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల తయారీతో బిజీగా ఉన్న నేతకార్మికులు.. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో ఇప్పుడు మరింత బిజీగా మారారు. ఈ అపూర్వ ఘట్టాన్ని ఇప్పుడు సాక్షాత్తూ మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఒక వార్తా పత్రికలో వచ్చిన క్లిప్లింగ్ ను జతచేసి మరీ సిరిసిల్ల నేతన్నల ఉపాది అవకాశాల గురించి చెప్పుకొచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిననాటి నుంచీ కేసీఆర్ సర్కారు సిరిసిల్ల నేతన్నలకు ఏడాదంతా ఉపాధి కల్పించడానికి సర్కారుచర్యలు తీసుకుంటోంది. ఉపాధి అవకాశాల కోసం నిరంతరాయంగా ఆర్డర్లు సమకూరుస్తోంది. ఇప్పటికే రాజన్నసిరిసిల్ల జిల్లాలో నేతన్నలకు రూ.300 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్తో తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పించింది. ప్రస్తుతం క్రిస్మస్, రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) ఆర్డర్లు కూడా ఇస్తూ వారికి చేతినిండా పని కల్పిస్తోంది. బతుకమ్మ చీరలు సెప్టెంబర్ మాసంతో పూర్తవుతాయి. ఆ తర్వాత నేతన్నలు ఖాళీగా ఉండకుండా క్రిస్మస్ కానుకలు ఇవ్వడం కోసం సర్కారు రూ.15 కోట్ల ఆర్డర్ ఇచ్చింది.

దీనికి తోడు రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం)కు సంబంధించి 1.3 కోట్ల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేయడానికి రూ.60 కోట్లు మంజూరు చేసింది. చేనేత జౌళిశాఖ అధికారులు ఇప్పటికే సిరిసిల్ల ఎస్ఎస్ఐ సంఘాలతో వస్త్రం తయారు చేయిస్తున్నారు. దీంతో సిరిసిల్లలో15 వేల మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ పని ముగియగానే రంజాన్ పండుగకు 6 లక్షల మీటర్ల వస్త్రాన్ని తయారు చేయించనున్నారు. రంజాన్ కానుకల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించనుంది. ఇలా ఉంటే, ప్రస్తుతం తాజాగా వచ్చిన తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్లతో ఇప్పుడు సిరిసిల్ల నేత కుటుంబాలు క్షణం తీరికలేకుండా మారిపోయాయి.

Read also: Paritala: అనంతపురం జిల్లా నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌.. ధర్మవరంలో టెన్షన్ టెన్షన్‌.. రంగంలోకి పరిటాల