AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మందు బాబులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన మద్యం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మందుబాబులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖ లిక్కర్ దుకాణాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. ఫుల్ బాటిల్ పై రూ.40 మేర ధర పెంచుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Telangana: మందు బాబులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన మద్యం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
Liquor Price Hike
Shaik Madar Saheb
|

Updated on: May 18, 2025 | 6:49 PM

Share

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మందుబాబులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖ లిక్కర్ దుకాణాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. ఫుల్ బాటిల్ పై రూ.40 మేర ధర పెంచుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. క్వార్టర్‌ మద్యం బాటిల్‌పై రూ.10 మేర ధర పెరగగా.. హాఫ్‌ బాటిల్‌పై రూ.20 మేర ధర పెరిగింది. కాగా.. తెలంగాణ సర్కార్‌ ఇటీవలే బీర్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా.. లిక్కర్‌ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, కొన్ని బ్రాండ్లపై మాత్రమే ప్రభుత్వం ధరలు పెంచినట్లు తెలుస్తోంది.. పెరిగిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

2020లో అప్పటి ప్రభుత్వం.. స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టింది. దాని ప్రకారం మద్యం బాటిళ్లపై సెస్‌ను పెంచారు.. అయితే.. స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ఎక్సైజ్ శాఖ మళ్లీ ఇప్పుడు పునరుద్దరిస్తూ చర్యలు తీసుకుంది.. ఈ కొత్త ఒప్పందం.. జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ లోపే మద్యం ధరలు పెంచి డిస్టిలరీలు, డిస్టిబ్యూటర్లు, సప్లై కంపెనీతో ఒప్పందాలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..