రాజ్‌భవన్‌ లో బతుకమ్మ సంబరాలు!

రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై బతుకమ్మ వేడుకల్లో పాల్గొని.. తెలుగులో తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలుగులో తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభా కాంక్షలు తెలిపారు. మహిళలు బంగారం, దుస్తులతోపాటుపూలను బాగా ఇష్టపడతారని, శరత్‌రుతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండగ బతుకమ్మ అని ఆమె […]

రాజ్‌భవన్‌ లో బతుకమ్మ సంబరాలు!

Edited By:

Updated on: Oct 01, 2019 | 1:22 AM

రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై బతుకమ్మ వేడుకల్లో పాల్గొని.. తెలుగులో తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలుగులో తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభా కాంక్షలు తెలిపారు. మహిళలు బంగారం, దుస్తులతోపాటుపూలను బాగా ఇష్టపడతారని, శరత్‌రుతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండగ బతుకమ్మ అని ఆమె వివరించారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు గౌరమ్మ ఉయ్యాలో…అంటూ మహిళలు ఎంతో ఉత్సాహంలో పాటలుపాడి భక్తితో బతుకమ్మ ఆడారు. ఈకార్యక్రమంలో సాహితీ అభిమానులు, రచయిత్రులు ఐనంపూడి శ్రీలక్ష్మి, ఆవుల మంజులత, దీపికారెడ్డి ఆమె శిష్యబృందంతో కలిపి దాదాపు రెండువందల మందికి పైగా మహిళలు ఈ ఉత్సవాల్లోపొల్గొన్నారు. రాజ్‌భవన్‌ ప్రాంగణంలో అక్టోబరు 5వ తేదీ వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5గంటల నుంచి 6గంటల వరకు వేడుకలు నిర్వహిస్తున్నట్టు గవర్నర్‌కార్యదర్శి సురేంద్ర మోహన్‌ తెలిపారు. ముఖ్యంగా అక్టోబరు 1న మహిళా జర్నలిస్టులు, న్యాయవాదులు, అక్టోబరు 4న విద్యార్ధులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే అక్టోబరు 5న రాజ్‌భవన్‌ మహిళా ఉద్యోగులు, రాజ్‌భవన్‌ పరివారం పాల్గొంటారని అన్నారు.

[svt-event date=”30/09/2019,11:01PM” class=”svt-cd-green” ]