AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దివ్యాంగులకు కళ్యాణ లక్ష్మీ సాయం పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం

పేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్లి కానుకగా ‘కళ్యాణ లక్ష్మీ’ , ముస్లిం వర్గాలకు ‘షాదీ ముబారక్’ పేరుతో  తెలంగాణ ప్రభుత్వం రూ.1,00,116 అందజేస్తున్న సంగతి తెలిసిందే. రెండో పెళ్లి చేసుకుంటున్న వారికి కూడా కళ్యాణ లక్ష్మిని వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. మొదటి పెళ్లి చేసుకున్న సమయంలో కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సాయం పొందని వారు.. రెండో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తితే.. వారికి ఆర్థిక సాయం చేయనున్నారు. తాజా తెలంగాణ […]

దివ్యాంగులకు కళ్యాణ లక్ష్మీ సాయం పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం
Ram Naramaneni
|

Updated on: Jun 30, 2019 | 6:12 AM

Share

పేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్లి కానుకగా ‘కళ్యాణ లక్ష్మీ’ , ముస్లిం వర్గాలకు ‘షాదీ ముబారక్’ పేరుతో  తెలంగాణ ప్రభుత్వం రూ.1,00,116 అందజేస్తున్న సంగతి తెలిసిందే. రెండో పెళ్లి చేసుకుంటున్న వారికి కూడా కళ్యాణ లక్ష్మిని వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. మొదటి పెళ్లి చేసుకున్న సమయంలో కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సాయం పొందని వారు.. రెండో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తితే.. వారికి ఆర్థిక సాయం చేయనున్నారు. తాజా తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

సాధారణ లబ్ధిదారుల కంటే దివ్యాంగులైన యువతులకు కళ్యాణ లక్ష్మి సాయాన్ని 25 శాతం అదనంగా ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇక నుంచి దివ్యాంగులైన పెళ్లికూతురు తల్లి బ్యాంకు ఖాతాలో రూ.1,25,145 నగదు పడనుంది. సంబంధిత ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆరంభంలో రూ. 51 వేలు మాత్రమే ఇచ్చేవారు. కాగా, 2017-18 బడ్జెట్‌లో ఈ పథకానికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని రూ. 51 వేల నుంచి రూ. 75,116లకు పెంచారు. 2018, మార్చి 19న ఈ మొత్తాన్ని రూ. 1,00,116కు పెంచారు.