తెలంగాణలో తగ్గిన కరోనా వైరస్ తీవ్రత.. కొత్తగా 186 మందికి పాజిటివ్ నిర్దారణ

|

Jan 30, 2021 | 10:23 AM

తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 186 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు.

తెలంగాణలో తగ్గిన కరోనా వైరస్ తీవ్రత.. కొత్తగా 186 మందికి పాజిటివ్ నిర్దారణ
Follow us on

Telangana corona : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలో మెల్లమెల్లగా తగ్గముఖం పడుతోంది. కొత్తగా 186మంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 186 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,306కి చేరింది. ఇక, ఇప్పటివరకు మహమ్మారి బారినపడి 1,598 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2,354 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా రాకాసి నుంచి కోలుకుని 2,90,354 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.