Telangana Corona: తెలంగాణాలో గణనీయంగా తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు

|

Aug 26, 2021 | 7:36 PM

Telangana Corona: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 81,193 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది. తాజాగా 357 కొత్త కేసులు నమోదయ్యాయి..

Telangana Corona: తెలంగాణాలో గణనీయంగా తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు
Ts Corona
Follow us on

Telangana Corona: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 81,193 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది. తాజాగా 357 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,56,455కు చేరుకుంది. ఇక గత 24 గంటల వ్యవధిలో ఒక్కరు కరోనా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా తో మరణించిన వారి సంఖ్య 3,865కి చేరింది. అయితే కొత్త కేసులకంటే రికవరీ సంఖ్య అధికంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల వ్యవధిలో 405 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని.. దీంతో రాష్ట్రం వ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,46,344కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,246 యాక్టివ్‌ కేసులున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Also Read:

 గత 24 గంటల్లో ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా విజృంభణ.. 1,539 కొత్త కేసులు నమోదు

కట్టుకున్న భార్యను భర్త అలా చేస్తే తప్పేం కాదు.. ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు సంచలన తీర్పు..

ఒకరు ఐఏఎస్..మరొకరు ఐఆర్ఎస్..తల్లిదండ్రి మరణించినా కష్టాలను అధిగమించి సత్తాచాటిన అక్కాచెల్లెళ్ల విజయ గాథ