Telangana BJP: నేడు జోగిపేటలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం.. హుజూరాబాద్ ఎన్నికలే టార్గెట్‌గా..

|

Sep 11, 2021 | 6:44 AM

Telangana BJP: జోగిపేటలో ఇవాళ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగనుంది. జోగిపేట శ్రీ రామ ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 1గంటలకు జరగనున్న ఈ సమావేశంలో

Telangana BJP: నేడు జోగిపేటలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం.. హుజూరాబాద్ ఎన్నికలే టార్గెట్‌గా..
Bandi Sanjay
Follow us on

Telangana BJP: జోగిపేటలో ఇవాళ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగనుంది. జోగిపేట శ్రీ రామ ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 1గంటలకు జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులు పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరుగనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్, లక్ష్మణ్, రాజా సింగ్ తదితరులు ఈ పదాధికారుల సమావేశంలో పాల్గొంటారు.

ఈ సమావేశంలో ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర గురించి చర్చ నిర్వహిస్తారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న నిర్మల్‌లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవం బహిరంగ సభ గురించి సమీక్ష నిర్వహిస్తారు. నిర్మల్ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తుండటంతో పార్టీ ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇకపోతే హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించిన విషయాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ అంశాలను కూడా విశ్లేషించనున్నారు.

Also read:

Polavaram Project Updates: పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి.. కీలకమైన గ్యాప్3 నిర్మాణం పూర్తి..

Tamil Nadu: తమిళనాడులో దారుణం.. ఎంఎన్ఎంకే పార్టీ ముఖ్య నేత దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే కత్తులతో నరికి..

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం..