AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Old Currency: రద్దయిన పాత కరెన్సీని కొత్త నోట్లుగా మార్చేసే స్వామీజీ.. రూ.2 కోట్లు తరలిస్తుండగా.. సీన్‌లోకి పోలీసుల ఎంట్రీ..

రద్దయిన కరెన్సీ, దొంగ నోట్లను తరలిస్తున్న ముఠా అడ్డంగా బుక్కయింది. రెండు వాహనాల్లో రద్దయిన రూ.వెయ్యి, రూ.500 నోట్లు లభ్యమయ్యాయి. ఈ నోట్ల విలువ రూ.1.65 కోట్లు.

Old Currency: రద్దయిన పాత కరెన్సీని కొత్త నోట్లుగా మార్చేసే స్వామీజీ.. రూ.2 కోట్లు తరలిస్తుండగా.. సీన్‌లోకి పోలీసుల ఎంట్రీ..
Old Currency
Sanjay Kasula
|

Updated on: Oct 07, 2022 | 11:19 AM

Share

రద్దయిన నోట్లతోపాటు ఫేక్ కరెన్సీని తరలిస్తున్న ముఠాను ములుగు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ గురువారం ఈ వివరాలు వెల్లడించారు. వెంకటాపురంలో గురువారం పోలీసులు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాల్లో రద్దయిన రూ.వెయ్యి, రూ.500 నోట్లు పట్టుబడ్డాయి. ఈ నోట్ల విలువ సూమారు రూ.1.65 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. వెంకటాపురంలో గురువారం పోలీసులు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాల్లో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. సూర్యాపేట జిల్లా కేశవాపూర్ కు చెందిన పప్పుల నాగేంద్రబాబు, కోదాడ మండలం సాలర్జింగ్ పేటకు చెందిన శ్రీరాముల నాగ లింగేశ్వరరావు, భద్రాచలం ఏఎంసీ కాలానికి చెందిన మారె సాంబశివరావు, ములుగు జిల్లా వెంకటాపురంకి చెందిన బెజ్జంకి సత్యనారాయణ, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కనాడే గ్రామానికి చెందిన వడ్డీ శివరాజ్, హైదరాబాద్ ఉప్పల్ బుద్ధనగర్ కు చెందిన ఆయుర్వేద వైద్యులు గంటా యాదగిరి, మలక్పేట బ్యాంకు కాలనీకి చెందిన ఠాకూర్ అజయ్ సింగ్, చత్తీస్ గడ్ కు చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ నోట్ల కథ వెనుక పెద్ద డ్రామా ఉంది. నాగేంద్రబాబు అనే వ్యక్తి చేసిన కుట్రలో వీరంతా ఇరుక్కుపోయారు. నాగేంద్రబాబు.. తాను చేసిన అప్పులు ఎక్కువ కావడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే బిజినెస్ చేయాలనుకున్నాడు. ఈ సంగతిని తన స్నేహితుడు నాగ లింగేశ్వరరావును కలిశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాబా పాత కరెన్సీని కొత్త నోట్లుగా మారుస్తారని నాగ లింగేశ్వరరావు నాగేంద్రబాబను నమ్మించాడు. ఇది నిజమే అనుకున్న నాగేంద్రబాబు అదే పనిలో పడ్డాడు. తనకు తెలిసిన వారికి రహ్యంగా ఈ విషయాన్ని చేరవేశాడు.

తనకు తెలిసినవారి వద్ద నుంచి కొంత పాత కరెన్సీని సేకరించాడు. ఇందులో ముందుగా హైదరాబాద్‌కు చెందిన వెంకట్ రెడ్డి, నవీన్ రెడ్డికి రూ. ఐదు లక్షలు ఇచ్చి వారి వద్ద సుమారు రూ. 2 కోట్ల రద్దయిన పాత కరెన్సీ, దొంగనోట్లను కొనుగోలు చేశాడు. ఆ డబ్బును భద్రాచలం నుంచి వెంకటాపురం మీదుగా హైదరాబాద్ తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారినుంచి పాత కరెన్సీ, దొంగ నోట్లు, రెండు కార్లు, 9 ఫోన్ లు, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే నాగేంద్ర బాబుకు కట్టు కథ చెప్పిన స్నేహితుడు నాగ లింగేశ్వరరావు కోసం గాలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు