Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ మార్గాల్లో డైలీ ప్యాసింజర్‌ రైళ్ల పునురుద్ధరణ

|

Jul 20, 2022 | 8:20 PM

Restoration of Trains: కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దేశ వ్యాప్తంగా పలు రైళ్లను భారత రైల్వే (Indian Railways) పునరుద్ధరించింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ మార్గాల్లో డైలీ ప్యాసింజర్‌ రైళ్ల పునురుద్ధరణ
Follow us on

Restoration of Trains: కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దేశ వ్యాప్తంగా పలు రైళ్లను భారత రైల్వే (Indian Railways) పునరుద్ధరించింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వివిధ కారణాలతో గతంలో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరింరించింది. ఆ వివరాలు పూర్తిగా మీకోసం..

  • ట్రైన్‌ నంబర్‌ 07596/ Old TR No.57690 కాచిగూడ- నిజామాబాద్‌ ట్రైన్‌ను జులై 22 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈరైలు 09.55 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి.. 13.50 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటుంది.
  • రైలు సర్వీసు నంబర్‌ 07596/ Old TR No.57690 నిజామాబాద్‌- కాచిగూడ రైలు జులై 22 నుంచి పునఃప్రారంభంకానుంది. ఈరైలు 14.55 గంటలకు బయలుదేరి 18.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
  • 07432/ Old TR No.67264 సికింద్రాబాద్‌- వరంగల్‌ సర్వీసు జులై 25 నుంచి ప్రారంభం కానుంది. ఈరైలు 09.35 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి 13.15 గంటలకు వరంగల్‌ చేరుకుంటుంది.
  • 07463/ Old TR No.67267 వరంగల్- హైద్రాబాద్‌ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి ప్రారంభంకానుంది. ఈ సర్వీసు 13.45 గంటలకు బయలుదేరి 18.05 గమ్యస్థానం చేరుకుంటుంది.
  • 07979/ Old TR No.67245 విజయవాడ- భద్రాచలం మధ్య తిరిగే ట్రైన్‌ జులై 25 నుంచి పునఃప్రారంభంకానుంది. ఈ రైలు 07.50 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 12.50 గంటలకు భద్రాచలం చేరుకుంటుంది.
    07278/ Old TR No.67246 భద్రాచలం- విజయవాడ మధ్య తిరిగే ట్రైన్‌ జులై 25 నుంచి పునఃప్రారంభంకానుంది. ఈ రైలు 07.50 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి 12.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
  • 07893/ Old TR No.77259 నిజామాబాద్‌- కరీంనగర్‌ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ రైలు 04.45 గంటలకు నిజామాబాద్‌ నుంచి బయలుదేరి 07.55 గంటలకు కరీంనగర్‌ చేరుకుంటుంది.
  • 07894/ Old TR No.77260 కరీంనగర్‌- నిజామాబాద్‌ మధ్య తిరిగే సర్వీసు జులై 25 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ రైలు 14.35 గంటలకు కరీంనగర్‌ నుంచి బయలుదేరి 20.40 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటుంది.
  • 07765/ Old TR No.77255 కరీంనగర్‌- సిర్పూర్‌ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ రైలు 08.00 గంటలకు కరీంనగర్‌ నుంచి బయలుదేరి 11.05 గంటలకు సిర్పూర్‌ చేరుకుంటుంది.
  • 07766/ Old TR No.77256 సిర్పూర్‌- కరీంనగర్‌ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ రైలు 11.50గంటలకు సిర్పూర్‌ నుంచి బయలుదేరి 14.30 గంటలకు కరీంనగర్‌ చేరుకుంటుంది.
  • 07591/ Old TR No.57605 సికింద్రాబాద్‌- వికారాబాద్‌ మధ్య తిరిగే రైలు ఆగస్టు 17 నుంచి పునఃప్రారంభంకానుంది. ఈ రైలు 07.40గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి 09.40 గంటలకు వికారాబాద్‌ చేరుకుంటుంది.
  • 07592/ Old TR No.57606 వికారాబాద్‌- కాచిగూడ మధ్య తిరిగే రైలు ఆగస్టు 17 నుంచి తిరిగ ప్రారంభంకానుంది. ఈ రైలు 10.55గంటలకు వికారాబాద్‌ నుంచి బయలుదేరి13.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..