Minister Malla Reddy: అక్రమార్జన, పన్ను ఎగవేత.. 40 గంటలుగా నాన్‌స్టాప్‌ ఐటీ సోదాలు.. మంత్రి మల్లారెడ్డి ఖజానాపై గురిపెట్టిన ఐటీ శాఖ..

| Edited By: Ravi Kiran

Nov 24, 2022 | 11:58 AM

40 గంటలుగా నాన్‌స్టాప్‌ ఐటీ సోదాలు. మరో 48గంటలు సాగే అవకాశం. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో 8కోట్ల 80 లక్షల నగదు సీజ్‌ చేశారు ఐటీ అధికారులు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఫారిన్‌ నుంచి రాగానే.. బ్యాంక్ లాకర్లు ఓపెన్‌ చేయాలని డిసైడ్‌ అయ్యారు.

Minister Malla Reddy: అక్రమార్జన, పన్ను ఎగవేత.. 40 గంటలుగా నాన్‌స్టాప్‌ ఐటీ సోదాలు.. మంత్రి మల్లారెడ్డి ఖజానాపై గురిపెట్టిన ఐటీ శాఖ..
Minister Malla Reddy
Follow us on

మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై నజర్ వేసిన ఐటీ శాఖ.. రెండో రోజూ సోదాలు కొనసాగించింది. మల్లారెడ్డి.. ఆయన తనయులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో రెయిడ్స్ చేసింది. నిన్న ఇంటి గేటు దాటి బయటికొచ్చిన మల్లారెడ్డి రెండు చేతులు పైకి లేపి చిరునవ్వు చిందించారు. కానీ ఇవాళ ఉదయం మాత్రం రాజకీయ కక్ష అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అస్వస్థతకు గురైన మల్లారెడ్డి తనయుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు ప్రవీణ్‌ రెడ్డిలు ఆస్పత్రిలో చేరారు. ట్రీట్‌మెంట్‌ తర్వాత తిరిగి ఇంటికి తీసుకెళ్లి పలు డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండో రోజు సోదాల్లో మూడు పరిణామాలు కీలకంగా మారాయి. మొదటిది.. ప్రీతి రెడ్డికి ఐటీ అధికారుల పిలుపు. ప్రీతి రెడ్డి.. మల్లారెడ్డి కోడలు. ఆమెకు పిలుపు అందగానే ఓ బ్యాగ్‌తో అధికారుల ఎదుట హాజరయ్యారు. అయితే ఆ బ్యాగ్‌లో ఏముంది అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అలాగే మల్లారెడ్డి మనవరాలు శ్రేయను బ్యాంక్‌కి తీసుకెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది.

సంతోష్‌ రెడ్డి ఇంట్లో రూ.4కోట్ల నగదు

ఇక రెండోది.. సంతోష్‌ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. సంతోష్‌ రెడ్డి.. మల్లారెడ్డి సమీప బంధువు. ఆయన ఇంట్లో ఏకంగా 4కోట్ల రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పలు డాక్యుమెంట్లను రెట్రివ్ చేశారు. వాటిలో ఏముందన్నది సస్పెన్స్‌గా మారింది. సంతోష్‌ రెడ్డి.. మల్లారెడ్డికి అత్యంత కీలకమైన వ్యక్తి. ఫ్యామిలీకి సంబంధించిన రియల్‌ ఎస్టేట్‌ భూముల కొనుగోళ్ల వ్యవహారాలను ఆయనే చూస్తారు. మల్లారెడ్డి కాలేజీలు, ఆర్థిక వ్యవహారాల్లోనూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారాయన.

మల్లారెడ్డి యూనివర్శిటీ వ్యవహారాలు చూసే ప్రవీణ్‌

ఫైనల్‌గా మూడోది ప్రవీణ్ ఇంట్లో సోదాలు.. నిన్న, ఇవాళ కూడా ఆయన నివాసంలో రెయిడ్స్‌ జరిగాయి. ఉదయం అస్వస్థతతో ఆస్ప్రత్రిలో అడ్మిట్ అయ్యారాయన. ట్రీట్‌మెంట్‌ అనంతరం ఇంటికి తీసుకెళ్లి పలు పత్రాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మల్లారెడ్డి యూనివర్శిటీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రవీణ్‌ రెడ్డే చూస్తారు. ఆయన ఇంట్లో గంటలకొద్ది సోదాలు చేయడం వెనుక ఆంతర్యమేంటన్నది తెలియాల్సి ఉంది.

రూ. 8.80 కోట్లకు పైగా నగదు

ఐటీ ఎటాక్స్‌లో ఇప్పటిదాకా రూ. 8.80 కోట్లకు పైగా నగదు దొరికింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, పన్ను ఎగవేత, మేనేజ్‌మెంట్‌ కోటా కింద సీట్ల అమ్మకాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది. విరామం లేకుండా కొనసాగుతున్న సోదాలు ఎప్పుడు ముగుస్తాయన్న చర్చ మాత్రం పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం