AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టేషన్ లోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్కైన ఖాకీ.. ఏసీబీ వలలో ఎస్ఐ

ఈమధ్య స్పీడ్ పెంచిన ఏసీబీ అధికారులు లంచాలకు రుచి మరిగిన అవినీతి అధికారులపై కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో మరో ఎస్ఐ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇందుకు సహకరించిన కానిస్టేబుల్స్ తోసహా ఆ ఎస్ఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

స్టేషన్ లోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్కైన ఖాకీ.. ఏసీబీ వలలో ఎస్ఐ
Parvathagiri Si
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 02, 2024 | 4:13 PM

Share

ఈమధ్య స్పీడ్ పెంచిన ఏసీబీ అధికారులు లంచాలకు రుచి మరిగిన అవినీతి అధికారులపై కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో మరో ఎస్ఐ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇందుకు సహకరించిన కానిస్టేబుల్స్ తోసహా ఆ ఎస్ఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్ఔఐ లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు. పోలీస్ స్టేషన్ లోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా బుక్కయ్యాడు. గూగులోతు వెంకన్న అనే ఎస్ఐ, ఓ కేసు విషయంలో బదావత్ భాస్కర్ అనే వ్యక్తి వద్ద నుండి 40 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవల గుడుంబా తయారీ కోసం ఓ వాహనంలో బెల్లం తరలిస్తున్న క్రమంలో పోలీసులు భాస్కర్ ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ కేసు విషయంలో పట్టుబడ్డ వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ వెంకన్న 70 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. తొలుత 20 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా ఎస్ఐకి చెల్లించగా, మరో 40 వేల రూపాయల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ తతంగంలో ముందు నుంచి సహకరించిన ఎస్ఐ డ్రైవర్ సదానందాన్ని సైతం ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

లంచం ఇవ్వడం ఇష్టం లేకే భాస్కర్ అనే బాధితుడు తమను ఆశ్రయించాడని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. అతని ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో ఎస్ఐని అరెస్ట్ చేశామన్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…